హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు బస్సు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల దాటగానే బస్సు వెనుక భాగంలో ఆయిల్ లీకై పొగలు వచ్చాయి. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఒక్కసారిగా పొగ రావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ షకీల్కి చెప్పి బస్సు ఆపేయించారు. ప్రయాణికులంతా గాబరా పడుతూ... హడావుడిగా బస్సు తిగారు.
అందరూ ఒకే సారి దిగే ప్రయత్నం చేయగా... కొందరు గాయపడ్డారు. అయినప్పటికీ అందరూ క్షేమంగా బయటకొచ్చి ఊపిరి పీల్చుకున్నారు. బస్సులు ఎలాంటి మంటలు వ్యాపించకపోయినప్పటికీ... వేరే బస్సు వచ్చే వరకూ వేచి చూశారు. దాదాపు 3 గంటలపై నిరీక్షించి వేరే బస్సులో బయలుదేరారు.
ఇవీ చూడండి: ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య