ETV Bharat / state

'రైతును లారీతో ఢీకొట్టి చంపిన ఇసుక మాఫియా'

author img

By

Published : Jul 30, 2020, 2:27 PM IST

Updated : Aug 1, 2020, 4:22 PM IST

రాజాపూర్ మండలం తిర్మలాపూర్​లో రైతు ఇసుక లారీ కింద పడి రైతు మృతి చెందడం గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. తమ పొలాల గుండా ఇసుక లారీలు నడపొద్దంటూ... అడ్డుకున్నందుకే ఇసుక మాఫియా లారీతో ఢీకొట్టి చంపారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.

'ఇసుక లారీలను అడ్డుకున్న రైతును లారీతో గుద్ది చంపిన ఇసుక మాఫియా'
'ఇసుక లారీలను అడ్డుకున్న రైతును లారీతో గుద్ది చంపిన ఇసుక మాఫియా'

మహబూబ్​నగర్​ జిల్లా రాజాపూర్​ మండలం తిర్మలాపూర్​లో ఇసుక లారీ ఢీకొట్టి... ఓ రైతు మృతి చెందిన ఘటన గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకే లారీ ఎక్కించి చంపారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.

గ్రామానికి చెందిన నర్సింహులు బుధవారం రాత్రి తన పొలం మీదుగా.. దుందుబీ వాగుకు వెళ్తున్న ఇసుక లారీని అడ్డుకున్నాడు. అయినప్పటికీ లారీ ముందుకు దూసుకుపోగా.. లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

నర్సింహులు మృతితో ఆగ్రహించిన స్థానిక రైతులు, గ్రామస్థులు లారీతో పాటు, అక్కడున్న ప్రొక్లైనర్, ద్విచక్రవాహనం సహా సామాగ్రిని ధ్వంసం చేశారు. నర్సింహులు మృతదేహంతో ఘటనా స్థలం వద్ద ఆందోళనకు దిగారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో 60 వేల మార్కును దాటిన కరోనా కేసులు

మహబూబ్​నగర్​ జిల్లా రాజాపూర్​ మండలం తిర్మలాపూర్​లో ఇసుక లారీ ఢీకొట్టి... ఓ రైతు మృతి చెందిన ఘటన గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకే లారీ ఎక్కించి చంపారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.

గ్రామానికి చెందిన నర్సింహులు బుధవారం రాత్రి తన పొలం మీదుగా.. దుందుబీ వాగుకు వెళ్తున్న ఇసుక లారీని అడ్డుకున్నాడు. అయినప్పటికీ లారీ ముందుకు దూసుకుపోగా.. లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

నర్సింహులు మృతితో ఆగ్రహించిన స్థానిక రైతులు, గ్రామస్థులు లారీతో పాటు, అక్కడున్న ప్రొక్లైనర్, ద్విచక్రవాహనం సహా సామాగ్రిని ధ్వంసం చేశారు. నర్సింహులు మృతదేహంతో ఘటనా స్థలం వద్ద ఆందోళనకు దిగారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో 60 వేల మార్కును దాటిన కరోనా కేసులు

Last Updated : Aug 1, 2020, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.