ETV Bharat / state

జడ్చర్లలో 11 గంటల వరకు 23 శాతం పోలింగ్

author img

By

Published : Apr 30, 2021, 10:28 AM IST

Updated : Apr 30, 2021, 11:50 AM IST

జడ్చర్ల పురపాలికలో పోలింగ్​ ప్రశాంతంగా జరుగుతోంది. జడ్చర్లలో ఉదయం 11 గంటల వరకు 23 శాతం పోలింగ్ నమోదైంది.

mahaboobnagar district
jadcharla polling

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల పురపాలికలో 27వార్డులకు పోలింగ్​ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఓటేసేందుకు ఓటర్లు పోలింగ్​ కేంద్రాలకు వస్తున్నారు. 54 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల వరకు 23 శాతం పోలింగ్ నమోదైంది. బరిలో 112 మంది అభ్యర్థులు ఉన్నారు.

కొవిడ్​ వ్యాప్తి దృష్ట్యా పోలింగ్​ కేంద్రాల వద్ద అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. ఓటు వేసేందుకు వచ్చే వారంతా మాస్కుధరించాలని సూచించారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల పురపాలికలో 27వార్డులకు పోలింగ్​ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఓటేసేందుకు ఓటర్లు పోలింగ్​ కేంద్రాలకు వస్తున్నారు. 54 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల వరకు 23 శాతం పోలింగ్ నమోదైంది. బరిలో 112 మంది అభ్యర్థులు ఉన్నారు.

కొవిడ్​ వ్యాప్తి దృష్ట్యా పోలింగ్​ కేంద్రాల వద్ద అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. ఓటు వేసేందుకు వచ్చే వారంతా మాస్కుధరించాలని సూచించారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి: ఖమ్మం కార్పొరేషన్‌లో కొనసాగుతున్న పోలింగ్

Last Updated : Apr 30, 2021, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.