ETV Bharat / state

సీఏఏ, ఎన్​పీఆర్​, ఎన్​ఆర్సీ వ్యతిరేక సదస్సు

author img

By

Published : Mar 7, 2020, 11:30 PM IST

మహబూబ్​నగర్​లో శాంతి, సామరస్యం పౌరసహజీవనం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆచార్య హరగోపాల్​, మాడభూషి శ్రీధర్​ హాజరయ్యారు. సీఏఏ, ఎన్పీఆర్​, ఎన్​ఆర్​సీ భారతదేశానికి అవసరం లేని చట్టాలని అన్నారు.

peace movement sadassu in mahabubnagaer
సీఏఏ, ఎన్​పీఆర్​, ఎన్​ఆర్సీ వ్యతిరేక సదస్సు

దేశంలో పెరుగుతున్న అసమానతలు, నిరుద్యోగం, హింస వల్లే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొందని ఆచార్య హరగోపాల్​ అన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త చట్టాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. మహబూబ్​నగర్​లో ఏర్పాటు చేసిన శాంతి, సామరస్యం, పౌరసహజీవనం సదస్సులో కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్​తో కలిసి పాల్గొన్నారు. మౌలిక, ఆర్థిక సమస్యలు, అసమానతలు పరిష్కారమైతే ఆ చట్టాలు నిలవకుండా పోతాయని హరగోపాల్ అన్నారు.

ఏ దేశంలో పుట్టిన వారు ఆ దేశ పౌరులు అనేది అంతర్జాతీయ సూత్రమని కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. అందుకు భిన్నంగా చట్టాలు చేయకూడదని, చేసినా అవి చెల్లవన్నారు. సీఏఏ, ఎన్​ఆర్సీ, ఎన్​పీఆర్​ దేశానికి అవసరం లేదన్నారు. చొరబాటుదారులను బయటకు పంపాలనుకుంటే అందుకనుగుమంగా చర్యలు తీసుకోవాలి కానీ పౌరసత్వాన్ని ప్రజల నుంచి దూరం చేయకూడదన్నారు. ఈ విషయాన్ని శాంతిపూర్వకంగా చెప్పేందుకు సదస్సులు నిర్వహిస్తున్నారు.

సీఏఏ, ఎన్​పీఆర్​, ఎన్​ఆర్సీ వ్యతిరేక సదస్సు

ఇవీ చూడండి: ప్రగతిలో భేష్: దేశానికే ఆదర్శంగా తెలంగాణ: గవర్నర్

దేశంలో పెరుగుతున్న అసమానతలు, నిరుద్యోగం, హింస వల్లే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొందని ఆచార్య హరగోపాల్​ అన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త చట్టాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. మహబూబ్​నగర్​లో ఏర్పాటు చేసిన శాంతి, సామరస్యం, పౌరసహజీవనం సదస్సులో కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్​తో కలిసి పాల్గొన్నారు. మౌలిక, ఆర్థిక సమస్యలు, అసమానతలు పరిష్కారమైతే ఆ చట్టాలు నిలవకుండా పోతాయని హరగోపాల్ అన్నారు.

ఏ దేశంలో పుట్టిన వారు ఆ దేశ పౌరులు అనేది అంతర్జాతీయ సూత్రమని కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. అందుకు భిన్నంగా చట్టాలు చేయకూడదని, చేసినా అవి చెల్లవన్నారు. సీఏఏ, ఎన్​ఆర్సీ, ఎన్​పీఆర్​ దేశానికి అవసరం లేదన్నారు. చొరబాటుదారులను బయటకు పంపాలనుకుంటే అందుకనుగుమంగా చర్యలు తీసుకోవాలి కానీ పౌరసత్వాన్ని ప్రజల నుంచి దూరం చేయకూడదన్నారు. ఈ విషయాన్ని శాంతిపూర్వకంగా చెప్పేందుకు సదస్సులు నిర్వహిస్తున్నారు.

సీఏఏ, ఎన్​పీఆర్​, ఎన్​ఆర్సీ వ్యతిరేక సదస్సు

ఇవీ చూడండి: ప్రగతిలో భేష్: దేశానికే ఆదర్శంగా తెలంగాణ: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.