ETV Bharat / state

ఆన్​లైన్​ ప్రజావాణికి 16 ఫిర్యాదులు - తెలంగాణ తాజా వార్తలు

మహబూబ్​నగర్ పట్టణంలో వెంటనే శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు కావడం వల్ల.. ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదులను స్వీకరించారు.

ఆన్​లైన్​ ప్రజావాణికి 16 ఫిర్యాదులు
ఆన్​లైన్​ ప్రజావాణికి 16 ఫిర్యాదులు
author img

By

Published : Sep 15, 2020, 7:20 AM IST

మమబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఆన్‌లైన్‌ ప్రజావాణికి 16 ఫిర్యాదులు వచ్చాయి. కొవిడ్​19 కారణంగా ఆన్​లైన్​లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. 16 మంది తమ ఫిర్యాదులను వాట్సప్‌ వీడియోకాల్‌ ద్వారా అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు.

వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫిర్యాదులలో ముఖ్యంగా భూములకు సంబంధించిన సమస్యలు, పింఛన్లు, పారిశుద్ధ్యానికి సంబంధించినవి ఉన్నాయని అధికారులు తెలిపారు. పారిశుద్ధ్య సమస్యకు సంబంధించి పట్టణంలోని అన్ని వార్డుల్లో శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించాని పుర అధికారులకు అదనపు కలెక్టర్​ ఆదేశించారు.

మమబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఆన్‌లైన్‌ ప్రజావాణికి 16 ఫిర్యాదులు వచ్చాయి. కొవిడ్​19 కారణంగా ఆన్​లైన్​లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. 16 మంది తమ ఫిర్యాదులను వాట్సప్‌ వీడియోకాల్‌ ద్వారా అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు.

వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫిర్యాదులలో ముఖ్యంగా భూములకు సంబంధించిన సమస్యలు, పింఛన్లు, పారిశుద్ధ్యానికి సంబంధించినవి ఉన్నాయని అధికారులు తెలిపారు. పారిశుద్ధ్య సమస్యకు సంబంధించి పట్టణంలోని అన్ని వార్డుల్లో శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించాని పుర అధికారులకు అదనపు కలెక్టర్​ ఆదేశించారు.

ఇదీ చూడండి: వ్యవసాయ బిల్లులపై రైతులకు కేంద్రం భరోసా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.