ETV Bharat / state

పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన కేటీఆర్ - తెలంగాణ తాజా వార్తలు

మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలను మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు ఈటల, శ్రీనివాస్‌గౌడ్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Government Medical College at mahabubnagar
పాలమూరులో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన మంత్రులు
author img

By

Published : Jul 13, 2020, 12:46 PM IST

ఆరేళ్లలోనే మహబూబ్‌నగర్‌ జిల్లా చాలా అభివృద్ధి చెందిందని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. పాలమూరు ప్రభుత్వ వైద్యశాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్​, ఈటలతో కలిసి ఆయన పాల్గొన్నారు. గతంలో ఏ చిన్న జబ్బు వచ్చినా ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లేవారని... ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా జిల్లా కేంద్రంలోనే పెద్ద ఆస్పత్రి నిర్మించుకోవడం సంతోషకరమన్నారు.

ముఖ్యమంత్రిని అడిగిన వెంటనే జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాల మంజూరు చేశారని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. దాదాపు 200 మంది వైద్య సిబ్బందితో ప్రజలకు వైద్య సేవలు అందుతాయని వెల్లడించారు.

ఆరేళ్లలోనే మహబూబ్‌నగర్‌ జిల్లా చాలా అభివృద్ధి చెందిందని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. పాలమూరు ప్రభుత్వ వైద్యశాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్​, ఈటలతో కలిసి ఆయన పాల్గొన్నారు. గతంలో ఏ చిన్న జబ్బు వచ్చినా ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లేవారని... ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా జిల్లా కేంద్రంలోనే పెద్ద ఆస్పత్రి నిర్మించుకోవడం సంతోషకరమన్నారు.

ముఖ్యమంత్రిని అడిగిన వెంటనే జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాల మంజూరు చేశారని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. దాదాపు 200 మంది వైద్య సిబ్బందితో ప్రజలకు వైద్య సేవలు అందుతాయని వెల్లడించారు.

ఇదీ చూడండి: ప్రపంచంపై కరోనా పంజా.. ఒక్కరోజే 2 లక్షల కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.