ETV Bharat / state

'ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్​ సిద్ధంగా ఉంది'

author img

By

Published : Sep 29, 2020, 11:04 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని.. అందుకు కార్యకర్తలు సైతం సమాయత్తం కావాలని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్​ కార్యకర్తలకు సూచించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, మెంబర్ షిప్​నకు సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్​ సిద్ధంగా ఉంది: డీసీసీ అధ్యక్షుడు
ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్​ సిద్ధంగా ఉంది: డీసీసీ అధ్యక్షుడు

మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సన్నద్ధమైందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో నేతలు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, మెంబర్ షిప్​నకు సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దాని ప్రకారం ప్రతి గ్రామానికి ఇద్దరు, పట్టణానికి సంబంధించి ప్రతి వార్డుకు నలుగురు కార్యకర్తలను నియమించాలని నిర్ణయించామన్నారు.

తెరాస ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగులను నిర్వీర్యం చేశారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్​ విమర్శించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా గుణపాఠం చెప్తారని భావిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్రాల్లో గ్రాడ్యుయేట్స్​, నిరుద్యోగులు, ఉద్యోగస్తులను పెద్ద ఎత్తున సమీకరించి ఓటరు నమోదు చేస్తామన్నారు.

మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సన్నద్ధమైందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో నేతలు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, మెంబర్ షిప్​నకు సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దాని ప్రకారం ప్రతి గ్రామానికి ఇద్దరు, పట్టణానికి సంబంధించి ప్రతి వార్డుకు నలుగురు కార్యకర్తలను నియమించాలని నిర్ణయించామన్నారు.

తెరాస ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగులను నిర్వీర్యం చేశారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్​ విమర్శించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా గుణపాఠం చెప్తారని భావిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్రాల్లో గ్రాడ్యుయేట్స్​, నిరుద్యోగులు, ఉద్యోగస్తులను పెద్ద ఎత్తున సమీకరించి ఓటరు నమోదు చేస్తామన్నారు.

ఇదీ చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించాలి : నిరంజన్‌ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.