మహబూబ్నగర్ జిల్లాలోని శ్రీశైలం లెప్ట్ పవర్ ఫ్లాంట్లో జరిగిన ప్రమాదంలో దుర్మరణం పాలైన విద్యుత్ సిబ్బందికి ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ప్రభాక్ రావు ఆధ్వర్యంలో శ్రీశైలం లెఫ్ట్ పవర్ ఫ్లాంట్ సిబ్బంది నివాళులు అర్పించారు. జెన్కో కార్యాలయం ముందు మృతుల ఆత్మ శాంతించాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తమ తోటి ఉద్యోగుల మృతికి నివాళిగా విద్యుత్ శక్తి కార్యాలయంలో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా పాటించాలని నిర్ణయించారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ దుర్ఘటన జరగడానికి గల కారణాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెన్కో చీఫ్ ఇంజినీర్, డీఇలు, ఏఈలు, జెన్కో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గణేషుడికీ ఓ పార్కు, మ్యూజియం ఉన్నాయి.. అవి ఎక్కడో తెలుసా!