గతంలో కంటే తెరాసకు తగ్గిన మెజార్టీ, ఓడిపోయిన సీట్లను చూస్తుంటే... ఏ క్షణమైనా రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి కనిపిస్తుందని భాజపా నేత డీకే అరుణ జోస్యం చెప్పారు. అసెంబ్లీ స్థానాలు కోల్పోయే ప్రమాదం ఉందని గ్రహించే కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు పోయారని ఎద్దేవా చేశారు. పాలమూరు లోక్సభ స్థానం తెరాస కైవసం చేసుకున్నా... నైతిక విజయం భాజపాదేనని వెల్లడించారు. జిల్లాలో తెరాస నేతలు గుండాగిరి చేసి భాజపా నాయకులను అడ్డుకోవాలని చూసినా, వారిని భయభ్రాంతులకు గురిచేసినా ఖబడ్దార్ అని అరుణ హెచ్చరించారు.
ఇవీ చూడండి: జూన్ 2న జెండా ఆవిష్కరణ చేసేది వీరే...