ETV Bharat / state

రాష్ట్రంలోనే తొలిసారిగా మక్తల్​లో కొవిడ్ ఆన్​లైన్ క్లీనిక్​ - మక్తల్ తాజా వార్తలు

మక్తల్ ప్రాంతంలోని ప్రజలకు ఆన్​లైన్ ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్త్యాల అన్నారు. నియోజకవర్గంలోని పలు పీహెచ్​సీలను ఆయన పరిశీలించారు. అతిత్వరలో మక్తల్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సౌకర్యాన్ని పూర్తిస్థాయిలో కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.

covid Online Clinic, Maktal, mahabubnagar news
covid Online Clinic, Maktal, mahabubnagar news
author img

By

Published : May 13, 2021, 10:59 PM IST

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... పేద ప్రజల కోసం కొవిడ్ ఆన్​లైన్ క్లీనిక్​ను రాష్ట్రంలోనే తొలిసారిగా మహబూబ్​నగర్​ జిల్లా మక్తల్ ప్రాంతంలో ఏర్పాటు చేశామని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా) గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్త్యాల అన్నారు. ఇక్కడి ప్రజలకు ఆన్​లైన్ ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

అత్యుత్తమ వైద్యం..

మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు పీహెచ్​సీ, మక్తల్ ఆసుపత్రితో పాటు పులిమామిడి, నర్వ, అమరచింతలోని పీహెచ్​సీలతో పాటు మాద్వార్, చిన్న పొర్ల గ్రామాల్లో కొవిడ్ పరిస్థితులను పరిశీలించారు. టెలీమెడిసిన్ ద్వారా పీహెచ్​సీల్లోని కొవిడ్ రోగులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కలెక్టర్ హరిచందనతోపాటు కొవిడ్ టాస్క్​ఫోర్స్​ను చూస్తున్న మంత్రి కేటీఆర్, సెక్రటరీ జయేశ్ రంజన్​కు అన్ని పీహెచ్​సీలలోని సౌకర్యాల నివేదికను సమర్పిస్తామన్నారు.

ఆక్సిజన్ పూర్తిస్థాయిలో..

ముఖ్యంగా మక్తల్ ప్రాంతంలోని కొవిడ్ రోగులు మహబూబ్​నగర్, రాయిచూర్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళుతున్నారని సందీప్ మక్త్యాల అన్నారు. ఆక్సిజన్ సౌకర్యం పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు గ్రహించామన్నారు. అతిత్వరలో మక్తల్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సౌకర్యాన్ని పూర్తిస్థాయిలో కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.

అమెరికా ఇండియన్ అసోసియేషన్- టీటా సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో ఐటీరంగ వైద్య సేవలను పేద ప్రజలకు పూర్తి ఉచితంగా అందించడమే తమ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు పార్వతి, శ్రీకాంత్, ఇతర సిబ్బంది, టీటా సిబ్బంది ఇలియాజ్, సౌమ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... పేద ప్రజల కోసం కొవిడ్ ఆన్​లైన్ క్లీనిక్​ను రాష్ట్రంలోనే తొలిసారిగా మహబూబ్​నగర్​ జిల్లా మక్తల్ ప్రాంతంలో ఏర్పాటు చేశామని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా) గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్త్యాల అన్నారు. ఇక్కడి ప్రజలకు ఆన్​లైన్ ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

అత్యుత్తమ వైద్యం..

మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు పీహెచ్​సీ, మక్తల్ ఆసుపత్రితో పాటు పులిమామిడి, నర్వ, అమరచింతలోని పీహెచ్​సీలతో పాటు మాద్వార్, చిన్న పొర్ల గ్రామాల్లో కొవిడ్ పరిస్థితులను పరిశీలించారు. టెలీమెడిసిన్ ద్వారా పీహెచ్​సీల్లోని కొవిడ్ రోగులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కలెక్టర్ హరిచందనతోపాటు కొవిడ్ టాస్క్​ఫోర్స్​ను చూస్తున్న మంత్రి కేటీఆర్, సెక్రటరీ జయేశ్ రంజన్​కు అన్ని పీహెచ్​సీలలోని సౌకర్యాల నివేదికను సమర్పిస్తామన్నారు.

ఆక్సిజన్ పూర్తిస్థాయిలో..

ముఖ్యంగా మక్తల్ ప్రాంతంలోని కొవిడ్ రోగులు మహబూబ్​నగర్, రాయిచూర్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళుతున్నారని సందీప్ మక్త్యాల అన్నారు. ఆక్సిజన్ సౌకర్యం పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు గ్రహించామన్నారు. అతిత్వరలో మక్తల్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సౌకర్యాన్ని పూర్తిస్థాయిలో కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.

అమెరికా ఇండియన్ అసోసియేషన్- టీటా సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో ఐటీరంగ వైద్య సేవలను పేద ప్రజలకు పూర్తి ఉచితంగా అందించడమే తమ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు పార్వతి, శ్రీకాంత్, ఇతర సిబ్బంది, టీటా సిబ్బంది ఇలియాజ్, సౌమ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.