ETV Bharat / state

క్లాస్​లో అటాచ్డ్​ బాత్రూం.. విద్యార్థులు పరేషాన్​

మనం ఇళ్లు కట్టుకునేటప్పుడో, అద్దెకు తీసుకునేటప్పుడో పడకగదికి అటాచ్డ్​ బాత్రూం ఉంటే బాగుంటుందనుకుంటాం. అలాంటి ఇంటిని ఏరికోరి కట్టుకోవడమో, కొనుక్కోవడమో కిరాయికి తీసుకోవడమో చేస్తుంటాం. కానీ పిల్లలు చదువుకునే సర్కారు బడిలోని తరగతి గదికి కూడా అటాచ్​డ్​ బాత్రూం ఉండాలని ఓ ప్రధానోపాధ్యాయుడు తరగతి గదిలోనే శౌచాలయాలు ఏర్పాటూ చేయించాడు. ఇదెక్కడో అనుకుంటున్నారా..! మన తెలంగాణలోని మహబూబ్​నగర్​ పట్టణంలోనే.

author img

By

Published : Jul 27, 2019, 5:43 PM IST

క్లాస్​లో అటాచ్డ్​ బాత్రూం.. విద్యార్థులు పరేషాన్​

ప్రభుత్వ పాఠశాలలో గదులు లేక ఆరు బయట, చెట్ల కింద తరగతులు నిర్వహించే దృశ్యాలు కోకొల్లలు. కానీ మహబూబ్ నగర్ పట్టణంలోని హరిజనవాడలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఏకంగా తరగతి గదిలోనే శౌచాలయాలు నిర్మించారు. ఇదేదో వినడానికి కొత్తగా ఉన్నా... వీటివల్ల పిల్లలు మాత్రం నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వాసన వస్తున్న కారణంగా తరగతి గదిలోని శౌచాలయాలను ఉపయోగించట్లేరు. పాఠశాలలో మరిన్ని మూత్ర శాలలు లేకపోవడం వల్ల విద్యార్థులు ప్రతి రోజు అవస్థలు పడుతున్నారు.

2014-15 విద్యా సంవత్సరంలో కొన్ని పాఠశాలకు సర్వ శిక్ష అభియాన్ నిధుల కింద మరుగుదొడ్లు, మూత్రశాలలు మంజూరు చేశారు. అయితే అప్పటికే కొన్ని పాఠశాలల్లో సౌకర్యాలు ఉన్నాయి. ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో​ కొత్తగా కట్టడానికి స్థలం లేకపోయినప్పటికీ... నిధులు వెనక్కిపోతాయనే భయంతో తరగతి గదుల్లోనే శౌచాలయాలు ఏర్పాటు చేశారు అప్పటి ప్రధానోపాధ్యాయుడు.

వీటి వల్ల విద్యార్థులు మూత్రశాలల పక్కనే కూర్చొని విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాసన వస్తున్నందున బయట కూర్చుందామన్న స్థలం లేకపోవడం వల్ల పిల్లలు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉన్నవే చిన్న గదులు... అందులో ఇలా మూత్రశాలలు నిర్మించడం వల్ల పిల్లలు గదుల్లో కూర్చోలేకపోతున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అధికారులు స్పందించి తరగతి గదిలో ఉన్న మరుగుదొడ్లను తొలగించాలని కోరుతున్నారు.

క్లాస్​లో అటాచ్డ్​ బాత్రూం.. విద్యార్థులు పరేషాన్​

ఇవీ చూడండి: మిట్టమధ్యాహ్నం మహిళ మెడలోంచి గొలుసు చోరీ

ప్రభుత్వ పాఠశాలలో గదులు లేక ఆరు బయట, చెట్ల కింద తరగతులు నిర్వహించే దృశ్యాలు కోకొల్లలు. కానీ మహబూబ్ నగర్ పట్టణంలోని హరిజనవాడలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఏకంగా తరగతి గదిలోనే శౌచాలయాలు నిర్మించారు. ఇదేదో వినడానికి కొత్తగా ఉన్నా... వీటివల్ల పిల్లలు మాత్రం నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వాసన వస్తున్న కారణంగా తరగతి గదిలోని శౌచాలయాలను ఉపయోగించట్లేరు. పాఠశాలలో మరిన్ని మూత్ర శాలలు లేకపోవడం వల్ల విద్యార్థులు ప్రతి రోజు అవస్థలు పడుతున్నారు.

2014-15 విద్యా సంవత్సరంలో కొన్ని పాఠశాలకు సర్వ శిక్ష అభియాన్ నిధుల కింద మరుగుదొడ్లు, మూత్రశాలలు మంజూరు చేశారు. అయితే అప్పటికే కొన్ని పాఠశాలల్లో సౌకర్యాలు ఉన్నాయి. ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో​ కొత్తగా కట్టడానికి స్థలం లేకపోయినప్పటికీ... నిధులు వెనక్కిపోతాయనే భయంతో తరగతి గదుల్లోనే శౌచాలయాలు ఏర్పాటు చేశారు అప్పటి ప్రధానోపాధ్యాయుడు.

వీటి వల్ల విద్యార్థులు మూత్రశాలల పక్కనే కూర్చొని విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాసన వస్తున్నందున బయట కూర్చుందామన్న స్థలం లేకపోవడం వల్ల పిల్లలు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉన్నవే చిన్న గదులు... అందులో ఇలా మూత్రశాలలు నిర్మించడం వల్ల పిల్లలు గదుల్లో కూర్చోలేకపోతున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అధికారులు స్పందించి తరగతి గదిలో ఉన్న మరుగుదొడ్లను తొలగించాలని కోరుతున్నారు.

క్లాస్​లో అటాచ్డ్​ బాత్రూం.. విద్యార్థులు పరేషాన్​

ఇవీ చూడండి: మిట్టమధ్యాహ్నం మహిళ మెడలోంచి గొలుసు చోరీ

Intro:TG_SRD_57_27_ODF_SANGAREDDY_AB_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) స్వచ్ఛ తెలంగాణ, హరితహార కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, ఇంద్రకరణ్ రెడ్డి లు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత(ODF) జిల్లాగా ప్రకటించేందుకు ఇరువురు మంత్రులకు సంగారెడ్డికి రాగా.. జిల్లా ఎమ్మెల్యేలు వారికి ఘన స్వాగతం పలికారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సంగారెడ్డి జిల్లాను ODF జిల్లాగా అంతర్జాలంలో నమోదు చేశారు. అనంతరం మంత్రులు, కలెక్టర్ విజయఢంకా మోగించారు. అయితే సంగారెడ్డి కి మంత్రులు వస్తున్నారన్నా ముందస్తు సమాచారంతో.. వేదిక ఆవరణలో జిల్లాకు చెందిన సర్పంచులు ధర్నా, బైఠాయింపు చేపట్టారు. ఉపసర్పంచులకు ఉమ్మడి చెక్ పవర్ తొలగించాలని డిమాండ్ చేశారు. ఓ సందర్భంలో మంత్రి ఎర్రబెల్లి సర్దిచెప్పేందుకు ప్రయత్నం చేయగా.. సర్పంచులు వినకపోవడంతో ఆయన మౌనంగా ఉండిపోయారు. అనంతరం పోలీసులు కొందరు సర్పంచులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కొత్త పంచాయతీరాజ్ చట్టంలో అనేక సంస్కరణలు చేపట్టి.. గ్రామాభివృద్ధి లో అన్ని అధికారులు సర్పంచులను ఇచ్చామన్నారు. ఇప్పటి నుంచి గ్రామంలో అన్ని పనులు సర్పంచ్ పర్యవేక్షణలోనే జరుగుతాయని.. పనులు సక్రమంగా చేయని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటాలని ప్రజలను కోరారు. అందరం సమిష్టిగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.


Body:బైట్: ఎర్రబెల్లి దయాకరరావు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు
బైట్: ఇంద్రకరణ్ రెడ్డి, దేవాదాయ,ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రి


Conclusion:నోట్:
1. మంత్రుల బైట్ 788 కిట్ ద్వారా లైవ్ లో వచ్చాయి వాడుకోగలరు.
2. సర్పంచులు ధర్నా చేసిన, విజువల్స్ TG_SRD_56_27_SARPANCH_DARNA స్లగ్ లో వచ్చాయి, వాడుకోగలరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.