పెండింగ్లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ రుణాలను వెంటనే మంజూరు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత రెండు సంవత్సరాలుగా దళిత నిరుద్యోగులకు రావాల్సిన ఎస్సీ కార్పొరేషన్ రుణాలను పురపాలక అధికారులు పెండింగ్లో ఉంచుతున్నారని రాష్ట్ర అధ్యక్షుడు స్కైలాబ్ బాబు ఆరోపించారు. ఇక గ్రౌండింగ్ చేయవలసిన అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.
దీనివల్ల ఎస్సీ నిరుద్యోగులు రుణాలు నోచుకోకపోవటం వల్ల తీవ్రఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా 29 శాతం మంది ఉపాధిని కోల్పోయారని వెల్లడించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్కు 1,500 కోట్ల రూపాయలను కేటాయించాలని కోరారు.