ETV Bharat / state

కేసముద్రంలో రైల్వే అండర్​ బ్రిడ్జ్​కు స్థల పరిశీలన - Kesamudram Railway Underbridge

మహబూబాబాద్​ జిల్లా కేసముద్రంలో రైల్వే అండర్ బ్రిడ్జి ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై రైల్వే అధికారిణి శ్వేతా పన్వర్, తహసీల్దార్ వెంకట్​రెడ్డి ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. సమగ్ర పరిశీలన అనంతరం మూడు ప్రాంతాల్లో అనువైన స్థలాన్ని గుర్తించినట్లు వెంకట్ రెడ్డి తెలిపారు.

Site inspection of Kesamudram Railway Under bridge in mahabubabad district
కేసముద్రంలో రైల్వే అండర్​ బ్రిడ్జ్​కు స్థల పరిశీలన
author img

By

Published : Sep 4, 2020, 4:23 PM IST

మహబూబాబాద్​ జిల్లా కేసముద్రంలో రైల్వే అండర్ బ్రిడ్జి లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మహబూబాబాద్​ ఎంపీలు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు కేసముద్రంలో ఆర్​యూబీ ఏర్పాటుకు అంగీకరించారు.

కేసముద్రంలో రైల్వే అండర్ బ్రిడ్జి ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై రైల్వే అధికారిణి శ్వేతా పన్వర్, తహసీల్దార్ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. సమగ్ర పరిశీలన చేసిన అనంతరం మూడు ప్రాంతాల్లో అనువైన స్థలాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఈ పరిశీలన నివేదికను ఫైనల్ చేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని శ్వేతా పన్వర్ వెల్లడించారు. ఈ సర్వేలో ఇంజినీర్లు, ఎంపీపీ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

మహబూబాబాద్​ జిల్లా కేసముద్రంలో రైల్వే అండర్ బ్రిడ్జి లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మహబూబాబాద్​ ఎంపీలు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు కేసముద్రంలో ఆర్​యూబీ ఏర్పాటుకు అంగీకరించారు.

కేసముద్రంలో రైల్వే అండర్ బ్రిడ్జి ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై రైల్వే అధికారిణి శ్వేతా పన్వర్, తహసీల్దార్ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. సమగ్ర పరిశీలన చేసిన అనంతరం మూడు ప్రాంతాల్లో అనువైన స్థలాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఈ పరిశీలన నివేదికను ఫైనల్ చేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని శ్వేతా పన్వర్ వెల్లడించారు. ఈ సర్వేలో ఇంజినీర్లు, ఎంపీపీ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.