ETV Bharat / state

కారు ఢీకొట్టి మూడు పశువులు మృతి, మరో రెండు..

author img

By

Published : Jul 28, 2020, 7:34 AM IST

Updated : Jul 28, 2020, 8:29 AM IST

అతి వేగంగా వస్తూ అదుపు తప్పిన కారు పశువులను ఢీకొట్టింది. దీంతో మూడు పశువులు అక్కడికక్కడే మృతిచెందగా, రెండింటికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు వద్ద చోటు చేసుకుంది.

అతివేగంగా వస్తూ పశువులను ఢీకొట్టిన కారు
అతివేగంగా వస్తూ పశువులను ఢీకొట్టిన కారు

ఖమ్మం జిల్లా ఇల్లందు నుంచి మహబూబాబాద్‌కు అతివేగంగా వస్తున్న టాక్సీ కారు బయ్యారం మండలం నామాల పాడు వద్ద పశువుల మందపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 3 పశువులు మృత్యువాత పడ్డాయి. మరో రెండు పశువులు తీవ్రంగా గాయపడ్డాయి.

కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు. ఈ పశువులు ముగ్గురు రైతులకు చెందినవి. సుమారు రూ. లక్షా 50 వేల వరకు నష్టం కలిగిందని బాధితులు పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లా ఇల్లందు నుంచి మహబూబాబాద్‌కు అతివేగంగా వస్తున్న టాక్సీ కారు బయ్యారం మండలం నామాల పాడు వద్ద పశువుల మందపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 3 పశువులు మృత్యువాత పడ్డాయి. మరో రెండు పశువులు తీవ్రంగా గాయపడ్డాయి.

కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు. ఈ పశువులు ముగ్గురు రైతులకు చెందినవి. సుమారు రూ. లక్షా 50 వేల వరకు నష్టం కలిగిందని బాధితులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

Last Updated : Jul 28, 2020, 8:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.