ETV Bharat / state

తాగొచ్చి డ్రైవింగ్ చేసిన ఆర్టీసీ డ్రైవర్

ఆర్టీసీ బస్సు డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడుపుతున్నాడని ఆరోపిస్తూ ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదంటూ డ్రైవర్​ను నిలదీశారు.

author img

By

Published : May 11, 2019, 12:00 PM IST

Updated : May 11, 2019, 12:51 PM IST

మద్యం సేవించి బస్సు నడిపిన డ్రైవర్

సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వయా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మీదుగా వేములవాడకు వెళ్తుంది. 47 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. అంతా బానే ఉండగా... గున్నేపల్లి స్టేజ్ సమీపంలో రహదారి పై జరుగుతున్న గొడవ వద్దకు బస్సు డ్రైవర్ బస్సు దిగి వెళ్ళాడు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండి ఊగుతూ నడుస్తున్నట్లుగా స్థానికులు గుర్తించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. వారంతా బస్సు నుంచి దిగి మద్యం సేవించి బస్సు నడపడమేంటని అతనిని నిలదీశారు. ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ మండిపడ్డారు. అనంతరం బస్సు కండక్టర్ వేరే ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను ఎక్కించి అక్కడ నుంచి వారిని పంపించారు.

మద్యం సేవించి బస్సు నడిపిన డ్రైవర్

సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వయా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మీదుగా వేములవాడకు వెళ్తుంది. 47 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. అంతా బానే ఉండగా... గున్నేపల్లి స్టేజ్ సమీపంలో రహదారి పై జరుగుతున్న గొడవ వద్దకు బస్సు డ్రైవర్ బస్సు దిగి వెళ్ళాడు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండి ఊగుతూ నడుస్తున్నట్లుగా స్థానికులు గుర్తించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. వారంతా బస్సు నుంచి దిగి మద్యం సేవించి బస్సు నడపడమేంటని అతనిని నిలదీశారు. ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ మండిపడ్డారు. అనంతరం బస్సు కండక్టర్ వేరే ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను ఎక్కించి అక్కడ నుంచి వారిని పంపించారు.

మద్యం సేవించి బస్సు నడిపిన డ్రైవర్
Intro:జే వెంకటేశ్వర్లు డోర్నకల్. 8008574820
......... ........ ........
TG_WGL_26_11_PRAYANIKULA__ANDOLANA_AV_G1_SD
......... ....... .........
ఆర్టీసీ అద్దెబస్సు డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడుపుతున్నాడని ఆరోపిస్తూ ప్రయాణికులు ఆందోళనకు దిగిన సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లి స్టేజ్ సమీపంలో చోటు చేసుకుంది. సూర్యాపేట డిపోకు చెందిన అద్దె బస్సు సూర్యాపేట వయా దంతాలపల్లి మీదుగా వేములవాడకు వెళుతుంది .బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. సూర్యాపేట దాక నిమ్మికల్ వద్ద డ్రైవర్ చారి బస్సు దిగి ఇంట్లోకి వెళ్ళి వచ్చినట్లు తెలిపారు .గున్నేపల్లి స్టేజ్ సమీపంలోకి బస్సు చేరుకున్నాక రహదారి పై జరుగుతున్న గొడవ వద్దకు బస్సు డ్రైవర్ బస్సు దిగి వెళ్ళాడు. మద్యం మత్తులో ఉండి ఊగుతూ నడుస్తున్న ట్లు అక్కడ ఉన్నవారు గుర్తించారు. ఈ విషయాన్ని బస్సులో ఉన్న ప్రయాణికులు గుర్తించి వారంతా బస్సు లొంచి కిందికి దిగారు. మద్యం సేవించి బస్సు నడుపడ మేంటని డ్రైవర్ను నిలదీశారు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారoటూ డ్రైవర్ ను ప్రశ్నించారు. అనంతరం బస్సు కండక్టర్ వేరే ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను ఎక్కించి అక్కడ నుంచి వారిని పంపించారు. అనంతరం ఖాళీ ఆర్టీసీ బస్సు ను తీసుకొని డ్రైవర్ సూర్యాపేట డిపోకు వెను తిరిగి వెళ్ళాడు.
బైట్.......
1.దేశగాని అశోక్ గౌడ్, స్థానికుడు


Body:ప్రయాణికుల ఆందోళన


Conclusion:ప్రయాణికుల ఆందోళన
Last Updated : May 11, 2019, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.