ETV Bharat / state

పోలీసు స్టేషన్​ ముందే భార్యను చంపిన భర్త

author img

By

Published : Jul 30, 2019, 7:44 PM IST

మహబూబాబాద్ జిల్లా మరిపెడలో దారుణం జరిగింది. పోలీస్ స్టేషన్ ముందే భార్యను కట్టుకున్న భర్తే గొంతు కోసి హత్య చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసు స్టేషన్​ ముందే భార్యను చంపిన భర్త

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం తాక్యా తండాకు చెందిన సేవాతో మహబూబాబాద్ జిల్లా ధారవత్ తండాకు చెందిన బానోత్ కస్తూరికి ఆరేళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత రెండు నెలల క్రితం భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు చోటు చేసుకోవటం వల్ల విడిపోయారు. కస్తూరి తన తల్లి గారింట్లో ఉంటూ పిల్లలను చదివిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి మరిపెడలోని ఓ ప్రైవేటు క్లినిక్​లో స్వీపర్​గా పనిచేస్తోంది.

పోలీసు స్టేషన్​ ముందే భార్యను చంపిన భర్త

తన భార్యపై భర్త కసి పెంచుకున్నాడు. కస్తూరి ఎక్కడ ఉంటుందో ఆరా తీశాడు. మంగళవారం ఆసుపత్రి వద్దకు వచ్చాడు. ఆమెతో మాట్లాడుతున్నట్లు నటిస్తూ తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందింది. అనంతరం ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్​కి వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ లోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

ఇవీచూడండి: రోడ్డు ప్రమాదంలో మామ అల్లుడు దుర్మరణం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం తాక్యా తండాకు చెందిన సేవాతో మహబూబాబాద్ జిల్లా ధారవత్ తండాకు చెందిన బానోత్ కస్తూరికి ఆరేళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత రెండు నెలల క్రితం భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు చోటు చేసుకోవటం వల్ల విడిపోయారు. కస్తూరి తన తల్లి గారింట్లో ఉంటూ పిల్లలను చదివిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి మరిపెడలోని ఓ ప్రైవేటు క్లినిక్​లో స్వీపర్​గా పనిచేస్తోంది.

పోలీసు స్టేషన్​ ముందే భార్యను చంపిన భర్త

తన భార్యపై భర్త కసి పెంచుకున్నాడు. కస్తూరి ఎక్కడ ఉంటుందో ఆరా తీశాడు. మంగళవారం ఆసుపత్రి వద్దకు వచ్చాడు. ఆమెతో మాట్లాడుతున్నట్లు నటిస్తూ తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందింది. అనంతరం ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్​కి వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ లోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

ఇవీచూడండి: రోడ్డు ప్రమాదంలో మామ అల్లుడు దుర్మరణం

Intro:జే. వెంకటేశ్వర్లు డోర్నకల్ 8008574820
........ ....... .......
TG_WGL_26_30_HATHYA_AB_TS10114
... ....... .....
మహబూబాబాద్ జిల్లా మరిపెడ లో దారుణం జరిగింది .భార్యను కట్టుకున్న భర్త గొంతు కోసి హత్య చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట చోటు చేసుకోవడం గమనార్హం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బేతల పాడు గ్ర
శివారు తాక్యా తండాకు చెందిన సేవా అనే వ్యక్తి తో మరిపెడ మండలం అబ్బాయపాలెం శివారు ధారవత్ తండాకు చెందిన బానోత్ కస్తూరికి(30) గత 6 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత రెండు నెలల క్రితం భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు చోటు చేసుకోవడంతో విడిపోయారు దీంతో కస్తూరి తన తల్లి గారింట్లో ఉంటూ పిల్లలను చదివిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి మరిపెడ లోని ఓ ప్రైవేటు ఆరెంపీ క్లినిక్ లో స్వీపర్గా పనిచేస్తోంది. ఈ క్రమంలో విడిపోయిన భార్య పై సేవా కక్ష పెంచుకున్నారు. తన భార్య ఏం చేస్తుంది ...ఎక్కడ ఉంటుంది అంటూ ఆరా తీశాడు. మంగళవారం ఆస్పత్రి వద్దకు చేరుకున్నాడు. భార్య తో మాట్లాడేందుకు దగ్గరకు వెళ్లి మాట్లాడుతున్నట్లు నటించిన అనంతరం తన వెంట తీసుకున్న పదునైన ఆయుధంతో ఒక్కసారిగా కస్తూరి గొంతు కోశాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా భయాందోళనకు గురయ్యారు. తీవ్ర గాయాలపాలైన కస్తూరి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. అనంతరం సేవా ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. పోలీస్ స్టేషన్ ఎదుట హత్య చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ ఎదుట హత్య జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు, తండావాసులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి తరలి వచ్చారు. ఆస్పత్రి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ లోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు
బైట్.........
1. వెంకన్న ఆర్ఎంపి వైద్యుడు మరిపెడ


Body:హత్య
TG_WGL_26_30_HATHYA_AB_TS10114


Conclusion:TG_WGL_26_30_HATHYA_AB_TS10114

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.