రైతులు, పేదల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో... 18 మంది అర్హులకు ... రూ. 6 లక్షల 13 వేల.... ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
కరోనా వైరస్ విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ... కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆకాశగంగా.. దూకింది పెంకితనంగా...