ETV Bharat / state

తొర్రూరులోని రోడ్లను శానిటేషన్​ చేసిన మంత్రి ఎర్రబెల్లి

author img

By

Published : Apr 4, 2020, 8:12 PM IST

ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుమేరకు రేపు రాత్రి 9గంటలకు అందరూ దీపాలు వెలిగించాలని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ప్రజలకు సూచించారు. మహబూబాబాద్​ తొర్రూరులోని రోడ్లపై ఆయన రసాయనాలను పిచికారీ చేశారు.

Minister Yerrabelli Dayakar Rao spraying chemicals on Mahabubad Turrur roads
తొర్రూరులోని రోడ్లను శానిటేషన్​ చేసిన మంత్రి ఎర్రబెల్లి

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తానే స్వయంగా రోడ్ల ఇరువైపులా రసాయనాలను పిచికారీ చేశారు. కరోనా నియంత్రణలో భాగంగా తొర్రూరు పట్టణంలోని అన్ని రోడ్లని శానిటేషన్ చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు రేపు 9 గంటలకు 9 నిమిషాల పాటు ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించాలని, ఎవరు దీనిని రాజకీయం చేయకూడదని విజ్ఞప్తి చేశారు.

ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉంటూ వ్యకిగత పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

తొర్రూరులోని రోడ్లను శానిటేషన్​ చేసిన మంత్రి ఎర్రబెల్లి

ఇవీ చూడండి: సీరియస్​గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తానే స్వయంగా రోడ్ల ఇరువైపులా రసాయనాలను పిచికారీ చేశారు. కరోనా నియంత్రణలో భాగంగా తొర్రూరు పట్టణంలోని అన్ని రోడ్లని శానిటేషన్ చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు రేపు 9 గంటలకు 9 నిమిషాల పాటు ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించాలని, ఎవరు దీనిని రాజకీయం చేయకూడదని విజ్ఞప్తి చేశారు.

ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉంటూ వ్యకిగత పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

తొర్రూరులోని రోడ్లను శానిటేషన్​ చేసిన మంత్రి ఎర్రబెల్లి

ఇవీ చూడండి: సీరియస్​గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.