మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఫ్లకార్డులు చేత పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. 2020-21 సంవత్సరానికి గాను ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరుకై యాక్షన్ ప్లాన్ను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. గతంలో ఇచిన రుణాలు మాఫీ చేయాలంటూ నినాదాలు చేశారు.
జిల్లా ఎస్సీ కార్పొరేషన్కు రూ.1500 కోట్లను మంజూరు చేయాలని కేవీపీఎస్ కార్యదర్శి కుర్రా మహేష్ డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దుడ్డెల రామ్మూర్తి, పట్టణ కార్యదర్శి యాకయ్య తదితరులు పాల్గొన్నారు.