ETV Bharat / state

కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. పలు పనులపై ఆదేశాలు

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ బయ్యారం మండలంలోని పలు గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించారు. అంగన్​ వాడి, ఆరోగ్య కేంద్రాలు, ఆశ్రమ పాఠశాలలను పరిశీలించారు. బయ్యారం ఎం‌పీడీ‌ఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు.

author img

By

Published : Mar 13, 2020, 11:51 PM IST

mahabubabad Collector sudden visit directions on various tasks
కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. పలు పనులపై ఆదేశాలు

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ పీవో గౌతమ్ పాత్రోలు పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులను పరిశీలించి గర్భిణీ స్త్రీలకు అందించే వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. చర్లపల్లి గ్రామంలోని నర్సరీలో మొక్కల పెంపకం గురించి ఆరా తీశారు. అంగన్​వాడి కేంద్రంలో చిన్న పిల్లలతో ముచ్చటించారు. ఇర్సులాపురం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో కలిసి కలెక్టర్ పాఠాలు విన్నారు.

బయ్యారం ఎం‌పీడీ‌ఓ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి విజ్ఞప్తులను కలెక్టర్​ స్వీకరించారు. అత్యధికంగా భూ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. భూ సమస్యల పరిష్కారం కోసం ఆర్​డీవో, తహసీల్దార్, అటవీ శాఖ అధికారులతో క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి నెల మొదటి 2 వారాలు ఆర్​డీవో ఏజెన్సీ మండలాల్లో ప్రజావాణి నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. పలు పనులపై ఆదేశాలు

ఇదీ చూడండి : 'ఆదాయానికి... బడ్జెట్​ అంచనాలకు పొంతన లేదు'

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ పీవో గౌతమ్ పాత్రోలు పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులను పరిశీలించి గర్భిణీ స్త్రీలకు అందించే వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. చర్లపల్లి గ్రామంలోని నర్సరీలో మొక్కల పెంపకం గురించి ఆరా తీశారు. అంగన్​వాడి కేంద్రంలో చిన్న పిల్లలతో ముచ్చటించారు. ఇర్సులాపురం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో కలిసి కలెక్టర్ పాఠాలు విన్నారు.

బయ్యారం ఎం‌పీడీ‌ఓ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి విజ్ఞప్తులను కలెక్టర్​ స్వీకరించారు. అత్యధికంగా భూ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. భూ సమస్యల పరిష్కారం కోసం ఆర్​డీవో, తహసీల్దార్, అటవీ శాఖ అధికారులతో క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి నెల మొదటి 2 వారాలు ఆర్​డీవో ఏజెన్సీ మండలాల్లో ప్రజావాణి నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. పలు పనులపై ఆదేశాలు

ఇదీ చూడండి : 'ఆదాయానికి... బడ్జెట్​ అంచనాలకు పొంతన లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.