hundi counting: మహబూబాబాద్ జిల్లా కురవి శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలోని హుండీల లెక్కింపును ఈవో సత్యనారాయణ పర్యవేక్షణలో నిర్వహించారు. ఆలయంలోని 16 హుండీల్లో భక్తులు వేసిన కానుకలను లెక్కించారు.
2020 అక్టోబర్ 26 నుంచి 2022 ఫిబ్రవరి 8 వరకు భక్తులు సమర్పించిన కానులను లెక్కించగా రూ.36.58 లక్షల ఆదాయం వచ్చిందని ఈవో పేర్కొన్నారు. వచ్చిన ఆదాయాన్ని స్వామి వారి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు ఆయన వెల్లడించారు.లెక్కింపు సందర్భంగా ఆలయ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు.
ఇదీ చదవండి:Women Gives Birth to 3 Infants: ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జననం ఎక్కడంటే