ETV Bharat / state

మిత్రుడి కుటుంబానికి జీహెచ్​ఎంసీ మేయర్​ పరామర్శ​ - జీహెచ్​ఎంసీ మేయర్​ పరామర్శ

విద్యుదాఘాతంతో మృతి చెందిన తన మిత్రుడి​ కుటుంబాన్ని జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​ పరామర్శించారు. మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్​నగర్​కు చెందిన మల్సూర్​ విద్యుదాఘాతంతో మరణించాడు. మేయర్​ రామ్మోహన్ మహబూబాబాద్​ చేరుకుని మల్సూర్​కు నివాళులర్పించారు.

జీహెచ్​ఎంసీ మేయర్
జీహెచ్​ఎంసీ మేయర్
author img

By

Published : Jun 20, 2020, 5:21 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్​కు చెందిన మల్సూర్ విద్యుదాఘాతంతో మరణించగా...​ జీహెచ్​ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అతని కుటుంబాన్ని పరామర్శించారు. మేయర్ రామ్మోహన్​ మహబూబాబాద్ చేరుకొని... స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్​తో కలిసి మల్సూర్ వెళ్లారు. బాల్య స్నేహితుడి మృతదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అతని అంత్యక్రియలలో పాల్గొన్నారు.

తన బాల్య స్నేహితుడు ఆకస్మికంగా మృతిచెందడం బాధాకరమని మేయర్​ రామ్మోహన్​ అన్నారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. అతని కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్​కు చెందిన మల్సూర్ విద్యుదాఘాతంతో మరణించగా...​ జీహెచ్​ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అతని కుటుంబాన్ని పరామర్శించారు. మేయర్ రామ్మోహన్​ మహబూబాబాద్ చేరుకొని... స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్​తో కలిసి మల్సూర్ వెళ్లారు. బాల్య స్నేహితుడి మృతదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అతని అంత్యక్రియలలో పాల్గొన్నారు.

తన బాల్య స్నేహితుడు ఆకస్మికంగా మృతిచెందడం బాధాకరమని మేయర్​ రామ్మోహన్​ అన్నారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. అతని కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: యుద్ధ వ్యూహాలతో శత్రు దేశాలను ఎదుర్కొందాం : సీఎం కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.