ETV Bharat / state

కూలీ పని చేసుకుంటున్న డిప్యూటీ ఎమ్మార్వో

ఎంతో కష్ట పడ్డాడు. ఎన్నో బాధలు ఎదుర్కొన్నాడు. ఆ కష్టం వృథా కాలేదు. తల్లిదండ్రుల కల నెరవేరుస్తూ డిప్యూటీ తహసీల్దార్​గా ఎంపికయ్యాడు. కానీ ఇప్పుడు కూలీగా మారాడు. ప్రభుత్వం పోస్టింగ్​ ఇవ్వక.. ఆర్థిక ఇబ్బందులతో కూలీ పని చేస్తున్నాడు మహబూబాబాద్ జిల్లా జగ్గుతండాకు చెందిన అజ్మీర హరిలాల్...

author img

By

Published : Jun 11, 2020, 4:09 PM IST

Updated : Jun 11, 2020, 4:42 PM IST

deputy thasildar Ajmira  harilal doing labour work in mahabubabad district
పోస్టింగ్​ లేక కూలీ పని చేసుకుంటున్న డీటీ
పోస్టింగ్​ లేక కూలీ పని చేసుకుంటున్న డిప్యూటీ ఎమ్మార్వో

మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం జగ్గుతండాకు చెందిన అజ్మీర హరిలాల్ 2019 ఏప్రిల్​లో జూనియర్ పంచాయతీ కార్యదర్శి గా ఎంపికై మరిపెడ మండలం పర్కల్​జాల్​తండాలో పంచాయతీ కార్యదర్శిగా పని చేశారు. అంతకు ముందు 2015లో గ్రూప్-2కు దరఖాస్తు చేసుకొని పరీక్ష రాసి 2017లో ర్యాంకు సాధించారు. 2019 ఆగస్టులో ఇంటర్వ్యూ పూర్తి చేసుకున్నాడు.

2019 డిసెంబర్​లో డిప్యూటీ తహసీల్దార్​గా నియామక పత్రం పొందారు. డీటీ కొలువు వచ్చింది కదా అని పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి కొద్దిరోజులు హైదరాబాద్​లోని గచ్చిబౌలి తారింగ్​లో శిక్షణ పొందారు. కరోనా వైరస్ నేపథ్యంలో శిక్షణ నుంచి వీరిని ఇంటికి పంపించారు. అనంతరం ప్రభుత్వం నుంచి వీరికి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఇంటి వద్దే ఉండాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో ఇప్పుడు కూలీ పని చేస్తున్నాడు అజ్మీర హరిలాల్.

ఒక అజ్మీర హరిలాలే కాదు ఇతనితోపాటు ఎంపికైన వారు ఇంటి వద్ద ఇబ్బందులు పడుతున్నారు. తమకు ఇప్పటికైనా పోస్టింగులు ఇప్పించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!

పోస్టింగ్​ లేక కూలీ పని చేసుకుంటున్న డిప్యూటీ ఎమ్మార్వో

మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం జగ్గుతండాకు చెందిన అజ్మీర హరిలాల్ 2019 ఏప్రిల్​లో జూనియర్ పంచాయతీ కార్యదర్శి గా ఎంపికై మరిపెడ మండలం పర్కల్​జాల్​తండాలో పంచాయతీ కార్యదర్శిగా పని చేశారు. అంతకు ముందు 2015లో గ్రూప్-2కు దరఖాస్తు చేసుకొని పరీక్ష రాసి 2017లో ర్యాంకు సాధించారు. 2019 ఆగస్టులో ఇంటర్వ్యూ పూర్తి చేసుకున్నాడు.

2019 డిసెంబర్​లో డిప్యూటీ తహసీల్దార్​గా నియామక పత్రం పొందారు. డీటీ కొలువు వచ్చింది కదా అని పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి కొద్దిరోజులు హైదరాబాద్​లోని గచ్చిబౌలి తారింగ్​లో శిక్షణ పొందారు. కరోనా వైరస్ నేపథ్యంలో శిక్షణ నుంచి వీరిని ఇంటికి పంపించారు. అనంతరం ప్రభుత్వం నుంచి వీరికి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఇంటి వద్దే ఉండాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో ఇప్పుడు కూలీ పని చేస్తున్నాడు అజ్మీర హరిలాల్.

ఒక అజ్మీర హరిలాలే కాదు ఇతనితోపాటు ఎంపికైన వారు ఇంటి వద్ద ఇబ్బందులు పడుతున్నారు. తమకు ఇప్పటికైనా పోస్టింగులు ఇప్పించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!

Last Updated : Jun 11, 2020, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.