ETV Bharat / state

దుకాణంపైకి ఎక్కాడు.. పైలోకాలకు చేరాడు

ఎండ వేడికి తట్టుకోలేక డబ్బా దుకాణంపై వరిగడ్డి పరుస్తుండగా ఓ యువకునికి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం సంభవించింది. ఈ తరుణంలో తీవ్రంగా గాయపడ్డ అతనిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

author img

By

Published : May 29, 2020, 9:48 PM IST

climbing the shop electricity accident and dead at mahabubabad
దుకాణంపైకి ఎక్కాడు.. పైలోకాలకు చేరాడు

డబ్బా దుకాణంపై వరిగడ్డి పరుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం సంభవించి ఓ యువకుడు మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా బంధం రోడ్​లో తాళ్లపూసపల్లికి చెందిన ప్రవీణ్ ఎలక్ట్రికల్ రిపేర్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఎండ వేడిమి తట్టకోలేక డబ్బాదుకాణంపైకి ఎక్కి వరి గడ్డి పరుస్తున్నాడు.

ఆ క్రమంలో ప్రక్కనే ఉన్న విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. తీవ్రంగా గాయపడ్డ అతనిని మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

డబ్బా దుకాణంపై వరిగడ్డి పరుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం సంభవించి ఓ యువకుడు మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా బంధం రోడ్​లో తాళ్లపూసపల్లికి చెందిన ప్రవీణ్ ఎలక్ట్రికల్ రిపేర్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఎండ వేడిమి తట్టకోలేక డబ్బాదుకాణంపైకి ఎక్కి వరి గడ్డి పరుస్తున్నాడు.

ఆ క్రమంలో ప్రక్కనే ఉన్న విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. తీవ్రంగా గాయపడ్డ అతనిని మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

ఇదీ చూడండి : ఆవేదనతో ఉన్న అసంఘటిత కార్మికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.