విద్యుత్ బిల్లుల స్లాబ్ల విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా భాజపా ఆందోళన నిర్వహించింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అధిక విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలని భాజపా నాయకుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి అన్నారు. విపత్కర పరిస్థితులలో ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం.. ఛార్జీల రూపంలో పెనుభారం మోపిందని ఆరోపించారు.
బిల్లులను కట్టే పరిస్థితి లేదు...
పేద, మధ్య తరగతి ప్రజలు కరెంట్ బిల్లులను కట్టే పరిస్థితి లేదని శ్రీధర్రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పనితీరు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారిందని విమర్శించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని హితవుపలికారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే.. ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం