ETV Bharat / state

కుమురంభీం జిల్లాలో ప్రశాంతంగా ప్రాదేశిక పోలింగ్​ - prarambamaina pradeshika ennikalu

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక పోలింగ్​ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కుమురంభీం జిల్లాలో ప్రశాంతంగా ప్రాదేశిక పోలింగ్​
author img

By

Published : May 6, 2019, 2:17 PM IST

కుమురంభీం జిల్లాలో ప్రశాంతంగా ప్రాదేశిక పోలింగ్​

కుమురంభీం జిల్లాలో మొదటి విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. గ్రామాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. జిల్లా సంయుక్త పాలనాధికారి రాంబాబు సిర్పూర్ మండల కేంద్రంలో ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మొదటి విడతలో జిల్లాలోని 6 మండలాలు సిర్పూర్ టి, దహేగాం, కౌటాల, బెజ్జురు, చింతలమానేపల్లి, పెంచికలపేటలో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 30 సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్​ నిర్వహించనున్నారు.

ఇవీ చూడండి: గరిడేపల్లిలో మండలంలో 'ప్రచారం' గొడవ

కుమురంభీం జిల్లాలో ప్రశాంతంగా ప్రాదేశిక పోలింగ్​

కుమురంభీం జిల్లాలో మొదటి విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. గ్రామాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. జిల్లా సంయుక్త పాలనాధికారి రాంబాబు సిర్పూర్ మండల కేంద్రంలో ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మొదటి విడతలో జిల్లాలోని 6 మండలాలు సిర్పూర్ టి, దహేగాం, కౌటాల, బెజ్జురు, చింతలమానేపల్లి, పెంచికలపేటలో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 30 సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్​ నిర్వహించనున్నారు.

ఇవీ చూడండి: గరిడేపల్లిలో మండలంలో 'ప్రచారం' గొడవ

Intro:filename:

tg_adb_04_06_sirpur_pradeshika_ennikalu_av_c11


Body:కుమురం భీం జిల్లా లో మొదటి విడత పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. గ్రామాల్లోని ఓటర్లు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. వేసవి కాలం కావడంతో ఉదయం పూటనే ఓటువేసేందుకు తరలివచ్చారు. జిల్లా సంయుక్త పాలనధికారి డా. పి. రాంబాబు సిర్పూర్ టి మండల కేంద్రంలో ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

మొదటి విడతలో జిల్లాలోని 6మండలాలు సిర్పూర్ టి, దహేగాం, కౌటాల, బెజ్జురు, చింతలమానేపల్లి, పెంచికలపేటలో జరుగుతున్నాయి. ఆరు మండలాల్లో మొత్తం 108741 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
227 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేసిన అధికారులు 2910 మంది ఎన్నికల సిబ్బందిని కేటాయించారు. పోలింగ్ సందర్బంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటి విడత ఎన్నికల్లో 34 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన పోలీసులు 30 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ప్రభావిత ప్రాంతమైనందున పోలింగ్ సమయం 4గంటల వరకు నిర్వహించనున్నారు.




Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.