కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీనివల్ల రోజూకూలీ పని చేసుకుని బతికే పేదప్రజలు తినడానికి తిండిలేక అవస్థలు పడుతున్నారు. వీరిని ఆదుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ముందుకొస్తున్నారు.
కుమురంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని 10వ వార్డు కౌన్సిలర్ వనమాల విజయారాము తన మిత్ర బృందం సహకారంతో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదేశాల మేరకు తన వార్డులోని పేద ప్రజలతో పాటు నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల్లో ఈ సరుకులు అందజేయనున్నట్లు తెలిపారు.