ETV Bharat / state

మట్టి గణపతే మహా గణపతి - మట్టి గణపతే మహా గణపతి

కోరిన వరాలిచ్చే ఏకదంతునికి ఏటేటా అంగరంగ వైభవంగా పూజలు చేస్తాం. ప్రకృతి ఇచ్చిన ఫలాలు, పుష్పాలు, పత్రితో అర్చిస్తాం.. కానీ ప్రకృతికే హాని చేసే రసాయనాలతో చేసిన విగ్రహాలను పూజిస్తాం.. ఇదేనా భక్తి అంటే.. పండుగంటే మధుర జ్ఞాపకంగా ఉండాలి కానీ. భరించలేని గరళంగా మిగలకూడదు. మట్టి విగ్రహాలకే పూజచేయాలని స్వచ్ఛందంగా భక్తుల్లో మార్పురావాలి.

మట్టి గణపతే మహా గణపతి
author img

By

Published : Sep 1, 2019, 11:58 PM IST


మట్టి విగ్రహాలే ఎందుకు ఉపయోగించాలి అనేది సహజంగా కలిగే అనుమానం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీలో రసాయనాలు ఉపయోగిస్తారు. చెరువులు నదుల్లో వీటిని విడిచి పెట్టినప్పుడు అవి పూర్తిగా కరుగవు. వాటిలోనున్న విష పదార్థాల వల్ల మనుషులకు చర్మవ్యాధులు.. జలచరాలకు ప్రాణాంతక వ్యాధులు వస్తాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

భక్తి కారాదు విషతుల్యం

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వివిధ రసాయనాల రంగులతో తయారైన విగ్రహాల్లో.. కాపర్ సల్ఫేట్, అల్యూమినియం బ్రోమైడ్, లెడ్ ఆక్సైడ్, మెర్క్యురీ సల్ఫైడ్, మెగ్నీషియం, సిలికాన్, ఆర్సెనిక్, జింక్ ఆక్సైడ్, రెడ్ ఆక్సైడ్, కోబాల్ట్, మాంగనీస్ డై ఆక్సైడ్, మాంగనిస్ సల్ఫేయిడ్, వైట్ స్పిరిట్, టర్ఫేన్, వార్నిష్ తదితరాలు ఉంటాయి. ఈ హానికారక మూలకాలు చెరువులు కుంటల్లో కలుస్తాయి. జలం గరళంగా మారుతుంది. సమీపంలోని భూగర్భ జలాలు కలుషితం అవుతాయి. ఈ విగ్రహాలను నిమజ్జనం చేసిన చెరువులోని చేపలు తింటే మెర్క్యురీ మూలకం శరీరంలోకి చేరుతుంది. మెదడులోని నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. చెరువుల్లో లేదా కుంటల్లో పెరిగే అరుదైన వృక్ష జాతులు కనుమరుగవుతాయి.

ప్రజల్లో మార్పు రావాలి

వినాయక చవితి వేడుకల్లో మట్టి గణపతి విగ్రహాలను కొలువుదిర్చేలా ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు గత కొన్నాళ్లుగా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. అనేక సంస్థలు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఫలితంగా పట్టణాలనుంచి పల్లెలకు గణపతుల ఆరాధన పెరిగింది. వెయ్యి అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. పల్లెలు పట్టణాలు అనే భేదం లేకుండా మార్పువస్తుంది అనడానికి నిదర్శనం ఏటా పెరుగుతున్న మట్టి విగ్రహాల తయారీయే. పూజకు ఉపయోగించే విగ్రహం.. వెదురు పందిరి.. ఖద్దరు వస్త్రాలు.. ఇవన్నీ కులవృత్తులకు ఉపాధి కల్పించేవే. కార్పొరేట్ కంపెనీల సహాయంతో కొన్ని సంస్థలు శిక్షణ నిర్వహిస్తున్నాయి. విద్యాసంస్థల్లో విద్యార్థులకు కంపెనీల్లో ఉద్యోగులకు తాము స్వయంగా బంకమట్టితో తయారు చేయించిన వాటిని పూజించే అవకాశం కల్పిస్తున్నాయి.

మట్టి గణపతే మహా గణపతి
ఇదీ చూడండి: మట్టి గణపతులనే పూజిద్దాం..


మట్టి విగ్రహాలే ఎందుకు ఉపయోగించాలి అనేది సహజంగా కలిగే అనుమానం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీలో రసాయనాలు ఉపయోగిస్తారు. చెరువులు నదుల్లో వీటిని విడిచి పెట్టినప్పుడు అవి పూర్తిగా కరుగవు. వాటిలోనున్న విష పదార్థాల వల్ల మనుషులకు చర్మవ్యాధులు.. జలచరాలకు ప్రాణాంతక వ్యాధులు వస్తాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

భక్తి కారాదు విషతుల్యం

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వివిధ రసాయనాల రంగులతో తయారైన విగ్రహాల్లో.. కాపర్ సల్ఫేట్, అల్యూమినియం బ్రోమైడ్, లెడ్ ఆక్సైడ్, మెర్క్యురీ సల్ఫైడ్, మెగ్నీషియం, సిలికాన్, ఆర్సెనిక్, జింక్ ఆక్సైడ్, రెడ్ ఆక్సైడ్, కోబాల్ట్, మాంగనీస్ డై ఆక్సైడ్, మాంగనిస్ సల్ఫేయిడ్, వైట్ స్పిరిట్, టర్ఫేన్, వార్నిష్ తదితరాలు ఉంటాయి. ఈ హానికారక మూలకాలు చెరువులు కుంటల్లో కలుస్తాయి. జలం గరళంగా మారుతుంది. సమీపంలోని భూగర్భ జలాలు కలుషితం అవుతాయి. ఈ విగ్రహాలను నిమజ్జనం చేసిన చెరువులోని చేపలు తింటే మెర్క్యురీ మూలకం శరీరంలోకి చేరుతుంది. మెదడులోని నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. చెరువుల్లో లేదా కుంటల్లో పెరిగే అరుదైన వృక్ష జాతులు కనుమరుగవుతాయి.

ప్రజల్లో మార్పు రావాలి

వినాయక చవితి వేడుకల్లో మట్టి గణపతి విగ్రహాలను కొలువుదిర్చేలా ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు గత కొన్నాళ్లుగా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. అనేక సంస్థలు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఫలితంగా పట్టణాలనుంచి పల్లెలకు గణపతుల ఆరాధన పెరిగింది. వెయ్యి అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. పల్లెలు పట్టణాలు అనే భేదం లేకుండా మార్పువస్తుంది అనడానికి నిదర్శనం ఏటా పెరుగుతున్న మట్టి విగ్రహాల తయారీయే. పూజకు ఉపయోగించే విగ్రహం.. వెదురు పందిరి.. ఖద్దరు వస్త్రాలు.. ఇవన్నీ కులవృత్తులకు ఉపాధి కల్పించేవే. కార్పొరేట్ కంపెనీల సహాయంతో కొన్ని సంస్థలు శిక్షణ నిర్వహిస్తున్నాయి. విద్యాసంస్థల్లో విద్యార్థులకు కంపెనీల్లో ఉద్యోగులకు తాము స్వయంగా బంకమట్టితో తయారు చేయించిన వాటిని పూజించే అవకాశం కల్పిస్తున్నాయి.

మట్టి గణపతే మహా గణపతి
ఇదీ చూడండి: మట్టి గణపతులనే పూజిద్దాం..
Intro:filename:

tg_adb_01_01_matti_vigrahala_pradanyatha_vo_ts10034


Body:
మట్టి గణపతే మహా గణపతి

***************************



మట్టి విగ్రహాలే ఎందుకు ఉపయోగించాలి అనేది సహజంగా కలిగే అనుమానం.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీలో రసాయనాలు ఉపయోగిస్తారు. చెరువులు నదుల్లో వీటిని విడిచి పెట్టినప్పుడు అవి పూర్తిగా కరగవు.. వాటిలో వదిన విష పదార్థాల వల్ల మనుషులకు చర్మవ్యాధులు.. జలచరాలకు ప్రాణాంతక వ్యాధులు వస్తాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. బంకమట్టి ఎర్ర మట్టితో తయారైన సహజ రంగులు అద్దిన విగ్రహాలను నిమజ్జనం చేస్తే చెరువులు నదులకు మరింత మేలు జరుగుతుందని పర్యావరణ వేత్తలు తెలుపుతున్నారు.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వివిధ రసాయనాల రంగులతో తయారైన విగ్రహాలలో.. కాపర్ సల్ఫేట్, అల్యూమినియం బ్రోమైడ్,లెడ్ ఆక్సైడ్, మెర్క్యురీ సల్ఫైడ్, మెగ్నీషియం, సిలికాన్, ఆర్సెనిక్, జింక్ ఆక్సైడ్, రెడ్ ఆక్సైడ్, కోబాల్ట్, మాంగనీస్ డై ఆక్సైడ్, మాంగనిస్ సల్ఫేయిడ్, వైట్ స్పిరిట్, టర్ఫేన్, వార్నిష్ తదితరాలు ఉంటాయి. ఈ హానికారక మూలకాలు చెరువులు కుంటల్లో కలుస్తాయి. జలం గరళంగా గా మారుతుంది. సమీపంలోని భూగర్భ జలాలు కలుషితం అవుతాయి. ఈ విగ్రహాలను నిమజ్జనం చేసిన చెరువులోని చేపలు తింటే మెర్క్యురీ మూలకం శరీరంలోకి చేరుతుంది. మెదడులోని నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. చెరువుల్లో లేదా కుంటల్లో పెరిగే అరుదైన వృక్ష జాతులు కనుమరుగవుతాయి.

వినాయక చవితి వేడుకల్లో మట్టి గణపతి విగ్రహాలను కొలువుదిర్చేలా ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు గత కొన్నాళ్లుగా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. అనేక సంస్థలు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఫలితంగా పట్టణాలనుండి పల్లెలకు గణపతుల ఆరాధన పెరిగింది. వెయ్యి అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలు పల్లెలు పట్టణాలు అనే భేదం లేకుండా మార్పువస్తుంది అనడానికి నిదర్శనం ఏటా పెరుగుతున్న మట్టి విగ్రహాల తయారీయే.. పూజకు ఉపయోగించే విగ్రహం.. వెదురు పందిరి.. ఖద్దరు వస్త్రాలు.. 21 రకాల ప్రతులు.. ఇవన్నీ కులవృత్తులకు ఉపాధి కల్పించేవే. కార్పొరేట్ కంపెనీల సహాయంతో కొన్ని సంస్థలు శిక్షణ నిర్వహిస్తున్నాయి. విద్యాసంస్థల్లో విద్యార్థులకు కంపెనీల్లో ఉద్యోగులకు తాము స్వయంగా బంకమట్టితో తయారు చేయించిన వాటిని పూజించే అవకాశం కల్పిస్తున్నాయి.

స్టార్ట్ పిటుసి, ఎండ్ పిటుసి వాడగలరు.

బైట్:
01) సదానందం, కాగజ్ నగర్
02) గొల్లన లత, కాగజ్ నగర్


Conclusion:KIRAN KIMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.