పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో పోలీసులు రక్తదాన శిబిరం చేపట్టారు. పట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మల్లారెడ్డి, ఎఎస్పీ వైవీస్ సుధీంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులకు రెడ్ క్రాస్ సొసైటీ నుంచి గుర్తింపు పత్రాలు అందజేశారు. రక్తదానం చేసిన యువకులను అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మల్లారెడ్డి, ఎఎస్పీ సుధీంద్ర, పలువురు పోలీసులు రక్తదానం చేశారు.
ఇదీ చూడండి : అకాల వర్షాలు.. అన్నదాతలకు కష్టాలు