ETV Bharat / state

మారని మిర్చి రైతు కష్టాలు...

ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు ధర లేక మిర్చి రైతు ఆవేదన చెందుతున్నాడు. ఈసారైనా మద్దతు ధర లభిస్తుందని అన్నదాత పెట్టకున్న ఆశా అడియాశే అయింది. కష్టానికి ఫలితం లేక ఖమ్మం కర్షకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

author img

By

Published : Feb 12, 2019, 8:00 AM IST

మారని మిర్చి రైతు కష్టాలు..
ఏటా అదే తంతు. ప్రతీ సీజన్​లోనూ అదే సీను. కోటి ఆశలతో మార్కెట్​కు వచ్చిన రైతుకు అందని ద్రాక్షే అయింది మద్దతు ధర. మార్కెట్​కు మిర్చి రానంతవరకూ అన్నదాతల్ని ఊరించే ధర... మిర్చితో మార్కెట్​తో నిండిపోతే అమాంతం పడిపోతుంది. ఖమ్మం జిల్లా రైతులను కష్టాల కడలిలోకి నెడుతోంది. వ్యాపారుల మాయజాలం... దళారుల దగా రైతును చిన్నాభిన్నం చేస్తున్నాయి.
undefined
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 25 వేల హెక్టార్లలో మిర్చి సాగు చేశారు. జనవరిలో 60 వేల క్వింటాళ్లు, ఫిబ్రవరిలో ఇప్పటి వరకు 25 వేల క్వింటాళ్ల మిర్చి మార్కెట్​లో అమ్ముడైంది. సీజన్ ఆరంభంలో క్వింటా మిర్చికి 9 వేల పైచీలుకు ధర పలికితే... ప్రస్తుతం మిర్చి అధికంగా రావడం వల్ల వ్యాపారులు ధరను 6 వేలకు తగ్గించారు. తేమ శాతం ఉందంటూ తక్కువ చెల్లిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మిర్చి కొనబోమంటూ వేధిస్తున్నారని అన్నదాతలు వాపోయారు. రవాణా ఖర్చులు భరించి మార్కెట్ కు వచ్చేకంటే...తమ తమ గ్రామాల్లోనే వ్యాపారులకు మిర్చి అమ్ముకోవడమే మేలంటున్నారు.
మార్కెట్ లో వ్యాపారుల మాయాజాంపై ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి...తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

మారని మిర్చి రైతు కష్టాలు..
ఏటా అదే తంతు. ప్రతీ సీజన్​లోనూ అదే సీను. కోటి ఆశలతో మార్కెట్​కు వచ్చిన రైతుకు అందని ద్రాక్షే అయింది మద్దతు ధర. మార్కెట్​కు మిర్చి రానంతవరకూ అన్నదాతల్ని ఊరించే ధర... మిర్చితో మార్కెట్​తో నిండిపోతే అమాంతం పడిపోతుంది. ఖమ్మం జిల్లా రైతులను కష్టాల కడలిలోకి నెడుతోంది. వ్యాపారుల మాయజాలం... దళారుల దగా రైతును చిన్నాభిన్నం చేస్తున్నాయి.
undefined
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 25 వేల హెక్టార్లలో మిర్చి సాగు చేశారు. జనవరిలో 60 వేల క్వింటాళ్లు, ఫిబ్రవరిలో ఇప్పటి వరకు 25 వేల క్వింటాళ్ల మిర్చి మార్కెట్​లో అమ్ముడైంది. సీజన్ ఆరంభంలో క్వింటా మిర్చికి 9 వేల పైచీలుకు ధర పలికితే... ప్రస్తుతం మిర్చి అధికంగా రావడం వల్ల వ్యాపారులు ధరను 6 వేలకు తగ్గించారు. తేమ శాతం ఉందంటూ తక్కువ చెల్లిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మిర్చి కొనబోమంటూ వేధిస్తున్నారని అన్నదాతలు వాపోయారు. రవాణా ఖర్చులు భరించి మార్కెట్ కు వచ్చేకంటే...తమ తమ గ్రామాల్లోనే వ్యాపారులకు మిర్చి అమ్ముకోవడమే మేలంటున్నారు.
మార్కెట్ లో వ్యాపారుల మాయాజాంపై ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి...తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Intro:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం కాలనీ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు నెలల పసి బాలుడు దుర్మరణం పాలయ్యాడు పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం చకరపల్లి గ్రామానికి చెందిన తెల్లం వెంకటేష్ అతని భార్య నాగలక్ష్మి వారి బంధువు వరుస శ్రీను లు మూడు నెలల పసికందు ని తీసుకుని ఓకే ద్విచక్రవాహనంపై అశ్వారావుపేట మండలం గుంటి మడుగు నుంచి వెలేరుపాడు వెళుతున్నారు ఈ క్రమంలో వారి ద్విచక్ర వాహనం నారాయణపురం కాలనీ లో ఒక కల్వర్టు ఢీకొట్టింది ఈ ఘటనలో పసికందు మృతి చెందగా మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను అశ్వరావుపేట సామాజిక ఆసుపత్రికి తరలించారు


Body:రోడ్డు ప్రమాదంలో మూడు నెలల పసికందు దుర్మరణం


Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.