ETV Bharat / state

నిధుల దుర్వినియోగంపై తెరాస నాయకుడు ఆమరణ నిరాహార దీక్ష

గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై తెరాస నాయకుడు కొనకండ్ల సత్యనారాయణ గత ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన దీక్షను విరమింపజేసేందుకు వెళ్లిన పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. నిధుల దుర్వినియోగానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేస్తున్నారు.

author img

By

Published : Sep 18, 2020, 7:36 PM IST

trs leader goes on hunger strike over misuse of funds in khammam district
నిధుల దుర్వినియోగంపై తెరాస నాయకుడు ఆమరణ నిరాహార దీక్ష

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సింగరేణి గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై గత ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెరాస నాయకుడు కొనకండ్ల సత్యనారాయణ దీక్షను విరమింప చేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జిల్లా స్థాయి అధికారులు కూడా నిధుల దుర్వినియోగం గుర్తించినప్పటికీ దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీక్షను బలవంతంగా విరమింప చేస్తే గృహంలోనే మరణిస్తానని ఆయన హెచ్చరించారు. ఆయన దీక్షను విరమింపజేసేందుకు వెళ్లిన పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. సీఐ శ్రీనివాసులు సర్దిచెప్పినా వినకపోవడం వల్ల ఒక దశలో వాగ్వాదం కూడా చోటుచేసుకుంది.

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సింగరేణి గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై గత ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెరాస నాయకుడు కొనకండ్ల సత్యనారాయణ దీక్షను విరమింప చేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జిల్లా స్థాయి అధికారులు కూడా నిధుల దుర్వినియోగం గుర్తించినప్పటికీ దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీక్షను బలవంతంగా విరమింప చేస్తే గృహంలోనే మరణిస్తానని ఆయన హెచ్చరించారు. ఆయన దీక్షను విరమింపజేసేందుకు వెళ్లిన పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. సీఐ శ్రీనివాసులు సర్దిచెప్పినా వినకపోవడం వల్ల ఒక దశలో వాగ్వాదం కూడా చోటుచేసుకుంది.

ఇవీ చూడండి: జోరుగా ఇసుక అక్రమ దందా.. పట్టించుకోని ఆధికారులు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.