ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చర్ల పరిధిలోని మునగాకు పరిశ్రమలో యంత్రాల ట్రయల్రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కర్ణన్, ఐటీడీఏ పీవో గౌతమ్ యంత్రాల ట్రయల్రన్ ప్రారంభించి, వాటి పనితీరును పరిశీలించారు. ఐటీడీఏ నిధులు, రైతుల సమన్వయంతో రూ.40 లక్షల వ్యయంతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
మునగాకు పొడిని ఔషధాలు, ఇతర పదార్థాల తయారీకి వినియోగించడంతో మునగ రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఈ పరిశ్రమ ద్వారా గిరిజన ప్రాంతాల్లో రైతులతో పాటు మరి కొంతమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డికి షోకాజ్ నోటీసు