ETV Bharat / state

రామగిరిలో వైభవంగా సీతారాముల కల్యాణం

author img

By

Published : Feb 7, 2020, 11:35 PM IST

వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాద్యాల నడుమ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. నాగర్​కర్నూల్​ జిల్లా రామగిరి క్షేత్రంలో మాఘ శుద్ధ త్రయోదశి సందర్భంగా జరిగిన ఈ వేడుకకు భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

SEETHARAMULA KALYANAM AT RAMAGIRY TEMPLE
SEETHARAMULA KALYANAM AT RAMAGIRY TEMPLE

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేటలోని రామగిరి క్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ వికారి నామ సంవత్సర మాఘ శుద్ధ త్రయోదశి సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవాన్ని ఏటా ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని ఆలయ ఛైర్మన్ రామస్వామి తెలిపారు.

రామగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణానికి భక్తులు పెద్దఎత్తున హాజరయ్యారు. వేడుకకు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జడ్పీటీసీ భరత్ ప్రసాద్, ఎంపీపీ సునీత తదితరులు పాల్గొన్నారు.

రామగిరిలో వైభవంగా సీతారాముల కల్యాణం

ఇవీ చూడండి: 'ఐదుగురికి ఉరిశిక్ష వేయడం అభినందనీయం'

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేటలోని రామగిరి క్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ వికారి నామ సంవత్సర మాఘ శుద్ధ త్రయోదశి సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవాన్ని ఏటా ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని ఆలయ ఛైర్మన్ రామస్వామి తెలిపారు.

రామగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణానికి భక్తులు పెద్దఎత్తున హాజరయ్యారు. వేడుకకు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జడ్పీటీసీ భరత్ ప్రసాద్, ఎంపీపీ సునీత తదితరులు పాల్గొన్నారు.

రామగిరిలో వైభవంగా సీతారాముల కల్యాణం

ఇవీ చూడండి: 'ఐదుగురికి ఉరిశిక్ష వేయడం అభినందనీయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.