ETV Bharat / state

ఖమ్మం జిల్లాలో బస్సు బోల్తా... ఒకరు మృతి - ఖమ్మం జిల్లాలో బస్సు బోల్తా... ఒకరు మృతి

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లక్ష్మీపురం సమీపంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈఘటనలో ఒకరు మృతి చెందగా...పలువురికి గాయలయ్యాయి.

khammam bus accident today news
author img

By

Published : Oct 21, 2019, 8:01 AM IST

Updated : Oct 21, 2019, 4:46 PM IST

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లక్ష్మీపురం వద్ద అదుపు తప్పి ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో చర్ల మండలం తేగడకు చెందిన దొడ్డి చిట్టిబాబు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మృతుడు చిట్టిబాబుతోపాటు భార్య సత్యవతి కుటుంబ సభ్యులు తమ కుమారుడు గియేశ్‌కు వచ్చే నెల 21న వివాహం ఉండటం వల్ల పెళ్లి దుస్తులకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బస్సు ప్రమాదం చోటు చేసుకోగా తండ్రి మృతి విషాదం మిగిల్చింది. మరో ప్రయాణికురాలు అరుణ పరిస్థితి విషమంగా ఉంది. బస్సు వేగంగా రావడం వల్ల మలుపు ఉండటంతో బస్సు అదుపు తప్పినట్లు ప్రయాణికులు తెలిపారు. బస్సు రహదారిపైనే కొద్ది దూరం దూసుకుపోయి బోల్తా పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. పెద్ద మలుపు ఉన్నా ఆర్‌అండ్‌బీ అధికారులు ఎలాంటి ప్రమాద నియంత్రికలు, సూచికలు ఏర్పాటు చేయడం లేదంటూ ఆ ప్రాంతవాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న వైరా ఏసీపీ ప్రసన్నకుమార్‌, కొణిజర్ల ఎస్సై యల్లయ్య క్షతగాత్రులను రెండు 108 వాహనాలతోపాటు ఇతర వాహనాల ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఖమ్మం జిల్లాలో బస్సు బోల్తా... ఒకరు మృతి


ఇవీ చూడండి: రైస్​ మిల్లులో వ్యక్తి అనుమానాస్పద మృతి

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లక్ష్మీపురం వద్ద అదుపు తప్పి ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో చర్ల మండలం తేగడకు చెందిన దొడ్డి చిట్టిబాబు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మృతుడు చిట్టిబాబుతోపాటు భార్య సత్యవతి కుటుంబ సభ్యులు తమ కుమారుడు గియేశ్‌కు వచ్చే నెల 21న వివాహం ఉండటం వల్ల పెళ్లి దుస్తులకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బస్సు ప్రమాదం చోటు చేసుకోగా తండ్రి మృతి విషాదం మిగిల్చింది. మరో ప్రయాణికురాలు అరుణ పరిస్థితి విషమంగా ఉంది. బస్సు వేగంగా రావడం వల్ల మలుపు ఉండటంతో బస్సు అదుపు తప్పినట్లు ప్రయాణికులు తెలిపారు. బస్సు రహదారిపైనే కొద్ది దూరం దూసుకుపోయి బోల్తా పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. పెద్ద మలుపు ఉన్నా ఆర్‌అండ్‌బీ అధికారులు ఎలాంటి ప్రమాద నియంత్రికలు, సూచికలు ఏర్పాటు చేయడం లేదంటూ ఆ ప్రాంతవాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న వైరా ఏసీపీ ప్రసన్నకుమార్‌, కొణిజర్ల ఎస్సై యల్లయ్య క్షతగాత్రులను రెండు 108 వాహనాలతోపాటు ఇతర వాహనాల ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఖమ్మం జిల్లాలో బస్సు బోల్తా... ఒకరు మృతి


ఇవీ చూడండి: రైస్​ మిల్లులో వ్యక్తి అనుమానాస్పద మృతి

Intro:tg_kmm_03_21_bus_accident_ab_ts10044

( )
note.. సార్ విజువల్స్ త్రీ జి కిట్ ద్వారా వచ్చాయి గమనించి వాడుకోగలరు


బస్సు బోల్తా పడి ఒకరి మృతి పలువురు గాయపడిన సంఘటన ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం లక్ష్మీపురం వద్ద చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లక్ష్మీపురం వద్ద బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడు పదిమందికి పదిమందికి స్వల్ప గాయాలు కాగా ఒకరికి తీవ్ర గాయమైంది. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని వేగంగా బస్సు నడపటం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలుపుతున్నారు...bytes
bytes.. బస్సులో ప్రయాణిస్తున్న క్షతగాత్రులు


Body:బస్సు బోల్తా


Conclusion:బస్సు బోల్తా
Last Updated : Oct 21, 2019, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.