ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఎమ్మెల్యే రాములు నాయక్ పర్యటించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక భరోసా కల్పించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాలు ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

అనంతరం మండలంలోని గుంపల్లగూడెంలో ఉప సర్పంచ్తో పాటు పలువురు కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరగా.. ఎమ్మెల్యే రాములు నాయక్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇదీచూడండి.. సన్నద్ధత లేకుండా.. పడకల పెంపు.. ప్రమాదం రెట్టింపు