బహుజనులు ఐక్యంగా రాజ్యాధికారం దిశగా ముందుకు కదలాలని సినీ విమర్శకుడు కత్తి మహేశ్ అన్నారు. ఖమ్మంలో పుస్తక ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానిక బహుజన కార్యాలయాన్ని మహేశ్ సందర్శించారు. మనువాదం, మార్కెట్ వాదం ప్రస్తుతం రాజ్యమేలుతున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ప్రస్తుత రోజుల్లో రాజ్యాధికారం సాధించడం చాలా కష్టం అన్నారు. అందరూ కలిసికట్టుగా ఆదిశగా పయనించాలని సూచించారు. బహుజన నాయకులు కత్తి మహేశ్ను ఘనంగా సన్మానించారు.
ఇవీ చూడండి: 'ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేయండి'