ETV Bharat / state

బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే

ఖమ్మం, ఇల్లెందు మధ్య వెళ్లే ఆర్టీసీ ప్రయాణికుల కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ బస్సులో ప్రయాణించారు. రాత్రి 8 గం.ల తర్వాత బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించారు. భద్రాచలం వెళ్లే బస్సులను ఇల్లెందు మీదుగా నడపాలని డీఎంను కోరారు.

author img

By

Published : Jul 3, 2019, 9:35 AM IST

బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే


ప్రతిరోజూ ఖమ్మం నుంచి ఇల్లెందుకు వెళ్లేందుకు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే హరిప్రియ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. తొలుత ఖమ్మం వెళ్లిన ఎమ్మెల్యే మంగళవారం రాత్రి ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లి అక్కడి డిపో మేనేజర్‌తో మాట్లాడారు. రాత్రి 8 గంటల తర్వాత ఖమ్మం నుంచి ఇల్లెందుకు బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఖమ్మం నుంచి కొత్తగూడెం, భద్రాచలం వెళ్లే బస్సులను ఇల్లెందు మీదుగా నడపాలని కోరారు. దీనికి డీఏం సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆర్టీసీ బస్సులో ఇల్లెందు వరకు ప్రయాణించారు.


ప్రతిరోజూ ఖమ్మం నుంచి ఇల్లెందుకు వెళ్లేందుకు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే హరిప్రియ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. తొలుత ఖమ్మం వెళ్లిన ఎమ్మెల్యే మంగళవారం రాత్రి ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లి అక్కడి డిపో మేనేజర్‌తో మాట్లాడారు. రాత్రి 8 గంటల తర్వాత ఖమ్మం నుంచి ఇల్లెందుకు బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఖమ్మం నుంచి కొత్తగూడెం, భద్రాచలం వెళ్లే బస్సులను ఇల్లెందు మీదుగా నడపాలని కోరారు. దీనికి డీఏం సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆర్టీసీ బస్సులో ఇల్లెందు వరకు ప్రయాణించారు.

ఇవీ చూడండి: అటవీశాఖ అధికారి దాడి ఘటనపై మంత్రుల భేటీ

For All Latest Updates

TAGGED:

busmlatravel
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.