ETV Bharat / state

నిత్యావసరాలు పంచిన ఎమ్మెల్యే సండ్ర

author img

By

Published : Apr 19, 2020, 6:24 PM IST

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఆపత్కాలంలో అందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతోనే నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

నిత్యావసరాలు పంచిన ఎమ్మెల్యే వెంకటవీరయ్య
నిత్యావసరాలు పంచిన ఎమ్మెల్యే వెంకటవీరయ్య

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకటవీరయ్య నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఆశా కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు, పూజారులు, పాస్టర్లు, ఇమాములు, బ్రాహ్మణులు మొత్తం 520 మందికి 3 లక్షల రూపాయల విలువైన సరుకులు అందజేశారు. సరుకుల పంపిణీకి రూ.1.40 లక్షలు ఆర్థిక సహాయం చేసిన శ్రీనివాస్ రెడ్డి, రాజేందర్ రెడ్డి అనే వ్యక్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆపత్కాలంలో అందరినీ ఆదుకోవాలనే ఆలోచనతోనే నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 18న సత్తుపల్లి నియోజకవర్గంలో 6 వేల మంది చేతివృత్తిదారులకు రూ. 40 లక్షల విలువైన నిత్యావసరాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకటవీరయ్య నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఆశా కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు, పూజారులు, పాస్టర్లు, ఇమాములు, బ్రాహ్మణులు మొత్తం 520 మందికి 3 లక్షల రూపాయల విలువైన సరుకులు అందజేశారు. సరుకుల పంపిణీకి రూ.1.40 లక్షలు ఆర్థిక సహాయం చేసిన శ్రీనివాస్ రెడ్డి, రాజేందర్ రెడ్డి అనే వ్యక్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆపత్కాలంలో అందరినీ ఆదుకోవాలనే ఆలోచనతోనే నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 18న సత్తుపల్లి నియోజకవర్గంలో 6 వేల మంది చేతివృత్తిదారులకు రూ. 40 లక్షల విలువైన నిత్యావసరాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: 'కరోనా అయితే నాకేంటి? నా దగ్గరకు అది రాలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.