ETV Bharat / state

'సామాన్యులపై ఎల్​ఆర్​ఎస్​ పెనుభారం' - ఖమ్మంలో సీపీఐ నిరసన

కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులతో చితికిపోతున్న ప్రజలపై ప్రభుత్వం ఎల్​ఆర్​ఎస్​ పెనుభారాన్ని మోపిందంటూ సీపీఐ నాయకులు ఆరోపించారు. ఖమ్మం మున్సిపల్​ కార్యాలయం ఎదుట ఎల్​ఆర్​ఎస్​ను వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు.

cpi protest in front of khammam municipality against the lrs
'సామాన్యులపై ఎల్​ఆర్​ఎస్​ పెనుభారం'
author img

By

Published : Oct 15, 2020, 2:18 PM IST

ఎల్ఆర్‌ఎస్‌ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 131ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఖమ్మం నగర పాలకసంస్థ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు ధర్నా చేశారు. పోలీసులు వారిని లోపలికి పోకుండా అడ్డుకున్నారు. సర్కారు, ఎల్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

లాక్​డౌన్‌ వల్ల ప్రజలు ఆర్థికంగా చితికిపోయిన సమయంలో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ అంటూ సామాన్యులపై పెనుభారం వేస్తుందని సీపీఐ రాష్ట్ర నాయకులు బాగం హేమంతరావు ఆరోపించారు. వెంటనే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

ఎల్ఆర్‌ఎస్‌ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 131ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఖమ్మం నగర పాలకసంస్థ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు ధర్నా చేశారు. పోలీసులు వారిని లోపలికి పోకుండా అడ్డుకున్నారు. సర్కారు, ఎల్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

లాక్​డౌన్‌ వల్ల ప్రజలు ఆర్థికంగా చితికిపోయిన సమయంలో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ అంటూ సామాన్యులపై పెనుభారం వేస్తుందని సీపీఐ రాష్ట్ర నాయకులు బాగం హేమంతరావు ఆరోపించారు. వెంటనే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై కేసీఆర్ వైఖరి చెప్పాలి: డీకే అరుణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.