ETV Bharat / state

'పట్టణాల్లో విజృంభిస్తున్న కరోనా... స్వీయ నియంత్రణ ఉండాల్సిందే'

author img

By

Published : Jul 29, 2020, 7:43 AM IST

జిల్లాల్లోనూ కొవిడ్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. దాదాపుగా అన్న జిల్లాలోనూ రోజువారీగా కేసులు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మార్చి నుంచి వైరస్ వ్యాప్తి ఉన్నా... లాక్​డౌన్ సమయంలో కేసుల తీవ్రత అదుపులో ఉంది. అన్​లాక్​ తర్వతా కేసులు ఒక్కసారిగా పెరగడం ప్రారంభించాయి. ప్రస్తుతం అన్ని పట్టణాల్లో వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకరి నుంచి ఒకరికి విస్తరిస్తూ తీవ్ర ప్రభావం చూపుతోంది.

corona-positive-cases-raised-in-khammam-district
'పట్టణాల్లో విజృంభిస్తున్న కరోనా... స్వీయ నియంత్రణ ఉండాల్సిందే'

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా వ్యాప్తి చెందిన తొలిరోజుల్లో ఒకటి, రెండు కేసులు నమోదవగా క్రమంగా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. పట్టణ ప్రాంతాలపై క్రమంగా తన పంజా విసురుతోంది. ముఖ్యంగా ఖమ్మం నగరంతోపాటు... ఇతర పట్టణ ప్రాంతాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నెల రోజులుగా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. ఉమ్మడి జిల్లాల్లో నమోదయ్యే కేసుల్లో దాదాపు 90 శాతం పట్టణ ప్రాంతాల్లోనే నమోదవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఖమ్మంలో...

ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 3,736 మంది నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా... 778 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆర్​టీపీసీఆర్, ర్యాపిడ్​ పరీక్షలు నిర్వహించి... 2,900 నమూనాలు సేకరించగా... వారిలో 680 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసుల్లో దాదాపు 90 శాతం ఒక్క ఖమ్మం నగరంలోనే కావడం గమనార్హం. వైరా, మధిర, సత్తుపల్లి పట్టణాలలో సైతం వైరస్ వృద్ధి చెందుతుంది.

భద్రాద్రిలో..

భద్రాద్రి జిల్లాలో 680 మందిక నమూనాలు సేకరించగా... 168 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ పాజిటివ్ కేసుల్లోనూ సింహభాగం కేసులు పట్టణ ప్రాంతాల్లో నమోదైనవే. పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల్లో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇల్లెందు, మణుగూరు పట్టణాల్లో ఇప్పటి వరకు 7 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

నెలరోజుల్లోనే..

ప్రస్తుతం అన్ని పట్టణాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వ్యాపార, వాణిజ్య కేంద్రాలు కావడం, ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారాలు రాకపోకలు సాగిస్తుండటంమే వైరస్ వ్యాప్తికి కారణమంటున్నారు వైద్యులు. ఎన్నిసార్లు హెచ్చరించినా... ప్రజల్లో నిర్లక్ష్యం వహించడం, చీటికీ మాటికీ విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు.

అప్రకటిత లాక్ డౌన్

ఈ క్రమంలోనే సామాజిక వ్యాప్తి ఎక్కువ అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని పట్టణాల్లో వ్యాపార, వాణిజ్య వర్గాలు ఆందోళనకు గురయ్యాయి. దీంతో స్వచ్ఛందంగా లాక్​డౌన్ విధించుకుని... వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 90 శాతం వ్యాపారాలన్నీ సాయంత్రం 6 గంటలకే మూసేస్తున్నారు.

అంతంత మాత్రంగానే...

వైరాలో ఓ గృహిణికి లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ తేలింది. భార్యకు వైరస్ సోకడంతో తనకూ పరీక్ష చేయాలని భర్త ప్రభుత్వ ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నా ర్యాపిడ్ కిట్లు అందుబాటులో లేకపోడవంతో మూడురోజులుగా అతనికి నిరీక్షణ తప్పడం లేదు. ఇలా అన్ని పురపాలికల్లో ర్యాపిడ్ కిట్​ల కొరత వేధిస్తుంది. కరోనా లక్షణాలున్నా ఎక్కడ పరీక్షలు చేయించుకోవాలో అర్థం కాని పరిస్థితి.

స్వీయ నియంత్రణే...

పాజిటివ్ కేసుల సంఖ్యే కాదు... మరణాల సంఖ్య కూడా పట్టణాల్లోనే ఎక్కువ. పరిస్థితిలో మార్పు రాకపోతే మున్ముందు కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అసలే కరోనా కాలం... ఆపై సీజనల్ వ్యాధులు ముంచెత్తే సమయం. ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తం కావాలి. స్వీయ నియంత్రణ పాటించాల్సిన తప్పనిసరి. ఇదే సమయంలో అధికార యంత్రాంగం కూడా... పట్టణ ప్రాంతాల్లో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ చూడండి: టూర్స్‌ అండ్ ట్రావెల్స్‌: షెడ్డులకే వాహనాలు.. తప్పని కష్టాలు

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా వ్యాప్తి చెందిన తొలిరోజుల్లో ఒకటి, రెండు కేసులు నమోదవగా క్రమంగా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. పట్టణ ప్రాంతాలపై క్రమంగా తన పంజా విసురుతోంది. ముఖ్యంగా ఖమ్మం నగరంతోపాటు... ఇతర పట్టణ ప్రాంతాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నెల రోజులుగా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. ఉమ్మడి జిల్లాల్లో నమోదయ్యే కేసుల్లో దాదాపు 90 శాతం పట్టణ ప్రాంతాల్లోనే నమోదవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఖమ్మంలో...

ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 3,736 మంది నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా... 778 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆర్​టీపీసీఆర్, ర్యాపిడ్​ పరీక్షలు నిర్వహించి... 2,900 నమూనాలు సేకరించగా... వారిలో 680 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసుల్లో దాదాపు 90 శాతం ఒక్క ఖమ్మం నగరంలోనే కావడం గమనార్హం. వైరా, మధిర, సత్తుపల్లి పట్టణాలలో సైతం వైరస్ వృద్ధి చెందుతుంది.

భద్రాద్రిలో..

భద్రాద్రి జిల్లాలో 680 మందిక నమూనాలు సేకరించగా... 168 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ పాజిటివ్ కేసుల్లోనూ సింహభాగం కేసులు పట్టణ ప్రాంతాల్లో నమోదైనవే. పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల్లో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇల్లెందు, మణుగూరు పట్టణాల్లో ఇప్పటి వరకు 7 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

నెలరోజుల్లోనే..

ప్రస్తుతం అన్ని పట్టణాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వ్యాపార, వాణిజ్య కేంద్రాలు కావడం, ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారాలు రాకపోకలు సాగిస్తుండటంమే వైరస్ వ్యాప్తికి కారణమంటున్నారు వైద్యులు. ఎన్నిసార్లు హెచ్చరించినా... ప్రజల్లో నిర్లక్ష్యం వహించడం, చీటికీ మాటికీ విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు.

అప్రకటిత లాక్ డౌన్

ఈ క్రమంలోనే సామాజిక వ్యాప్తి ఎక్కువ అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని పట్టణాల్లో వ్యాపార, వాణిజ్య వర్గాలు ఆందోళనకు గురయ్యాయి. దీంతో స్వచ్ఛందంగా లాక్​డౌన్ విధించుకుని... వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 90 శాతం వ్యాపారాలన్నీ సాయంత్రం 6 గంటలకే మూసేస్తున్నారు.

అంతంత మాత్రంగానే...

వైరాలో ఓ గృహిణికి లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ తేలింది. భార్యకు వైరస్ సోకడంతో తనకూ పరీక్ష చేయాలని భర్త ప్రభుత్వ ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నా ర్యాపిడ్ కిట్లు అందుబాటులో లేకపోడవంతో మూడురోజులుగా అతనికి నిరీక్షణ తప్పడం లేదు. ఇలా అన్ని పురపాలికల్లో ర్యాపిడ్ కిట్​ల కొరత వేధిస్తుంది. కరోనా లక్షణాలున్నా ఎక్కడ పరీక్షలు చేయించుకోవాలో అర్థం కాని పరిస్థితి.

స్వీయ నియంత్రణే...

పాజిటివ్ కేసుల సంఖ్యే కాదు... మరణాల సంఖ్య కూడా పట్టణాల్లోనే ఎక్కువ. పరిస్థితిలో మార్పు రాకపోతే మున్ముందు కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అసలే కరోనా కాలం... ఆపై సీజనల్ వ్యాధులు ముంచెత్తే సమయం. ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తం కావాలి. స్వీయ నియంత్రణ పాటించాల్సిన తప్పనిసరి. ఇదే సమయంలో అధికార యంత్రాంగం కూడా... పట్టణ ప్రాంతాల్లో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ చూడండి: టూర్స్‌ అండ్ ట్రావెల్స్‌: షెడ్డులకే వాహనాలు.. తప్పని కష్టాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.