ETV Bharat / state

Bhatti Vikramarka Comments: 'పౌరహక్కులు, స్వేచ్ఛ.. కేసీఆర్‌కు నచ్చవు' - Clp leader bhatti vikramarka news

Bhatti Vikramarka Comments: భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. దేశంలో తిరిగి రాజరికం, భూస్వామ్య వ్యవస్థను తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నారన్నారు.

Bhatti
Bhatti
author img

By

Published : Feb 3, 2022, 4:58 PM IST

Bhatti Vikramarka Comments: సమసమాజ స్థాపనకు... తద్వారా నవభారత నిర్మాణానికి నాంది పలికిన భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే.. తిరిగి దేశంలో రాజరికం, భూస్వామ్య వ్యవస్థను తీసుకురావటానికి జరుగుతున్న కుట్రగా చూడాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈరోజు పౌరులకు రక్షణ కల్పించే హక్కులను రాజ్యాంగం కల్పించిందన్నారు.

ప్రతి పౌరుడికి తన ఓటు హక్కు ద్వారా తనకు నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందన్నారు. ఫ్యూడల్ భావజాలం ఉన్న వారికి రాజ్యాంగం నచ్చటం లేదన్నారు. భారత రాజ్యాంగం ద్వారా గెలిచిన తెరాస ప్రజాప్రతినిధులు బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మేధావులు, ప్రజాస్వామ్య వాదులు, యువతను కోరారు.

కేసీఆర్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై దాడిగా చూడాలి. రాజరిక, భూస్వామ్య వ్యవస్థను తెచ్చేందుకు కేసీఆర్‌ కుట్ర. పౌరహక్కులు, స్వేచ్ఛ.. కేసీఆర్‌కు నచ్చవు. భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే.. తిరిగి దేశంలో రాజరికం, భూస్వామ్య వ్యవస్థను తీసుకురావటానికి జరుగుతున్న కుట్రగా దీన్ని చూడాలి.

-- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

'పౌరహక్కులు, స్వేచ్ఛ.. కేసీఆర్‌కు నచ్చవు'

ఇదీ చూడండి: Jeevan Reddy Comments: 'సీఎం హోదాలో కేసీఆర్​ అలా మాట్లాడటం సిగ్గుచేటు..'

Bhatti Vikramarka Comments: సమసమాజ స్థాపనకు... తద్వారా నవభారత నిర్మాణానికి నాంది పలికిన భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే.. తిరిగి దేశంలో రాజరికం, భూస్వామ్య వ్యవస్థను తీసుకురావటానికి జరుగుతున్న కుట్రగా చూడాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈరోజు పౌరులకు రక్షణ కల్పించే హక్కులను రాజ్యాంగం కల్పించిందన్నారు.

ప్రతి పౌరుడికి తన ఓటు హక్కు ద్వారా తనకు నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందన్నారు. ఫ్యూడల్ భావజాలం ఉన్న వారికి రాజ్యాంగం నచ్చటం లేదన్నారు. భారత రాజ్యాంగం ద్వారా గెలిచిన తెరాస ప్రజాప్రతినిధులు బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మేధావులు, ప్రజాస్వామ్య వాదులు, యువతను కోరారు.

కేసీఆర్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై దాడిగా చూడాలి. రాజరిక, భూస్వామ్య వ్యవస్థను తెచ్చేందుకు కేసీఆర్‌ కుట్ర. పౌరహక్కులు, స్వేచ్ఛ.. కేసీఆర్‌కు నచ్చవు. భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే.. తిరిగి దేశంలో రాజరికం, భూస్వామ్య వ్యవస్థను తీసుకురావటానికి జరుగుతున్న కుట్రగా దీన్ని చూడాలి.

-- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

'పౌరహక్కులు, స్వేచ్ఛ.. కేసీఆర్‌కు నచ్చవు'

ఇదీ చూడండి: Jeevan Reddy Comments: 'సీఎం హోదాలో కేసీఆర్​ అలా మాట్లాడటం సిగ్గుచేటు..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.