ETV Bharat / state

మిరపలో అంతుచిక్కని తెగులు... పెట్టుబడైనా దక్కదని రైతుల ఆవేదన

author img

By

Published : Nov 21, 2021, 1:25 PM IST

అంతుచిక్కని వేరు కుళ్లు తెగులు మిర్చి రైతులను కకావికలం చేసింది. లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటను నిలువునా దహించివేసింది. ఆరుగాలం శ్రమించిన మిర్చి పంట కళ్లేదుటే మాడిపోయి రైతు కంట కన్నీరు తెప్పిస్తోంది. సరైన దిగుబడులు రాక... అప్పులు తీర్చే మార్గం లేక అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఎన్ని మందులను పిచికారీ చేస్తున్నా... మొక్క మొదళ్లలో పోస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదని వాపోతున్నారు.

chilli crop diseases
chilli crop diseases

రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు మిరప రైతుల పాలిట శాపంగా మారాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు పెద్ద ఎత్తున తెగుళ్లు సోకడంతో... పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్ని మందులను పిచికారీ చేస్తున్నా.. మొక్క మొదళ్లలో పోస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదని వాపోతున్నారు. ఖమ్మం, మహబూబాబాద్‌, సూర్యాపేట, వరంగల్‌, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్లో కొన్నిచోట్ల 20 నుంచి 40 శాతం వరకు, మరికొన్ని చోట్ల సగం మేరకు వేలాది ఎకరాల్లో మొక్కలు చనిపోతుండడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

తెగుళ్ల రకాలు..

రాష్ట్రంలో 3,58,557 ఎకరాల్లో మిరప సాగవుతోంది. గతేడాది కంటే 1,17,765 ఎకరాల్లో అధికంగా సాగు చేపట్టారు. మిరప పంటలకు మూడు రకాల తెగుళ్లు వ్యాపించినట్లు మహబూబాబాద్‌ జేవీఆర్‌ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె.భాస్కర్‌ చెబుతున్నారు. ఒకటి ప్యూజరియం వడలు, ఎండు తెగులు వల్ల పూత, కాత రాలిపోయి, మొక్క తలలు వాల్చి ఆకులు పసుపు రంగుకు మారి మొక్క చనిపోతుంది. రెండోది వర్టిసిల్లియం. ఈ తెగులు ఆశించిన మొక్కలు చూడడానికి ఆకుపచ్చగానే ఉంటాయి. వడలిపోయి 2-3 రోజుల తర్వాత చనిపోతాయి. మూడోది వేరుకుళ్లు. తెగులు కారక శిలీంధ్రం ఆశించడంతో భూమి నుంచి నీటిని తీసుకోలేక ఎండిపోతాయి. వేరు పైభాగం పొరలుపొరలుగా ఊడి, తెల్లటి దట్టమైన బూజు పెరుగుతుంది. ఈ తెగులే ఎక్కువచోట్ల కనిపిస్తోంది. గత కొన్నిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెగని వర్షాలు కురుస్తుండడం వల్ల పారే నీటి ద్వారా ఇది ఎక్కువగా వ్యాపిస్తుండవచ్చని వ్యవసాయరంగ నిపుణులు పేర్కొంటున్నారు.

నివారణ మార్గాలు..

మొక్కలను నాటేటప్పుడు వేర్లను 2.5 గ్రాముల మోటాలాక్సిల్‌+మ్యాంకోజెబ్‌ మందును కలిపిన ద్రావణంలో 20 నిమిషాల పాటు ముంచి నాటుకోవాలి. తోటలో ఇలాంటి తెగుళ్లు సోకిన మొక్కను పీకి కాల్చివేయాలి. డ్రిప్‌ పద్ధతిలోనే నీరందించాలి. నేలలో తేమ ఉన్నప్పుడు ఎకరాకు రెండు కిలోల ట్రైకోడెర్మా విరిడి పొడిని 50 కిలోల కంపోస్టుతో కలిపి మొక్కల దగ్గర చల్లాలి. లీటరు నీటికి నాలుగు గ్రాముల ట్రైకోడెర్మా కలిపి మొక్క మొదళ్లలో పోయాలి. మొదటిసారి 3 గ్రాముల కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ను లీటర్‌ నీటికి కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి. మూడు రోజుల తర్వాత రెండోసారి 2.5 గ్రాముల కాపర్‌ హైడ్రాక్సైడ్‌ లేదా 2.5 గ్రాముల సైమాక్సినిల్‌+ మ్యాంకోజెబ్‌ మందును లీటరు నీటికి కలిపి మొదళ్ల దగ్గర పోయాలి. వారం పాటు నీటి తడులు ఆపాలి.

ఇదీ చదవండి: Farmers Problems: అన్నదాత ఉసురు తీస్తోన్న ముసురు.. తేమకు మొలకెత్తుతోన్న ధాన్యం

రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు మిరప రైతుల పాలిట శాపంగా మారాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు పెద్ద ఎత్తున తెగుళ్లు సోకడంతో... పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్ని మందులను పిచికారీ చేస్తున్నా.. మొక్క మొదళ్లలో పోస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదని వాపోతున్నారు. ఖమ్మం, మహబూబాబాద్‌, సూర్యాపేట, వరంగల్‌, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్లో కొన్నిచోట్ల 20 నుంచి 40 శాతం వరకు, మరికొన్ని చోట్ల సగం మేరకు వేలాది ఎకరాల్లో మొక్కలు చనిపోతుండడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

తెగుళ్ల రకాలు..

రాష్ట్రంలో 3,58,557 ఎకరాల్లో మిరప సాగవుతోంది. గతేడాది కంటే 1,17,765 ఎకరాల్లో అధికంగా సాగు చేపట్టారు. మిరప పంటలకు మూడు రకాల తెగుళ్లు వ్యాపించినట్లు మహబూబాబాద్‌ జేవీఆర్‌ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె.భాస్కర్‌ చెబుతున్నారు. ఒకటి ప్యూజరియం వడలు, ఎండు తెగులు వల్ల పూత, కాత రాలిపోయి, మొక్క తలలు వాల్చి ఆకులు పసుపు రంగుకు మారి మొక్క చనిపోతుంది. రెండోది వర్టిసిల్లియం. ఈ తెగులు ఆశించిన మొక్కలు చూడడానికి ఆకుపచ్చగానే ఉంటాయి. వడలిపోయి 2-3 రోజుల తర్వాత చనిపోతాయి. మూడోది వేరుకుళ్లు. తెగులు కారక శిలీంధ్రం ఆశించడంతో భూమి నుంచి నీటిని తీసుకోలేక ఎండిపోతాయి. వేరు పైభాగం పొరలుపొరలుగా ఊడి, తెల్లటి దట్టమైన బూజు పెరుగుతుంది. ఈ తెగులే ఎక్కువచోట్ల కనిపిస్తోంది. గత కొన్నిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెగని వర్షాలు కురుస్తుండడం వల్ల పారే నీటి ద్వారా ఇది ఎక్కువగా వ్యాపిస్తుండవచ్చని వ్యవసాయరంగ నిపుణులు పేర్కొంటున్నారు.

నివారణ మార్గాలు..

మొక్కలను నాటేటప్పుడు వేర్లను 2.5 గ్రాముల మోటాలాక్సిల్‌+మ్యాంకోజెబ్‌ మందును కలిపిన ద్రావణంలో 20 నిమిషాల పాటు ముంచి నాటుకోవాలి. తోటలో ఇలాంటి తెగుళ్లు సోకిన మొక్కను పీకి కాల్చివేయాలి. డ్రిప్‌ పద్ధతిలోనే నీరందించాలి. నేలలో తేమ ఉన్నప్పుడు ఎకరాకు రెండు కిలోల ట్రైకోడెర్మా విరిడి పొడిని 50 కిలోల కంపోస్టుతో కలిపి మొక్కల దగ్గర చల్లాలి. లీటరు నీటికి నాలుగు గ్రాముల ట్రైకోడెర్మా కలిపి మొక్క మొదళ్లలో పోయాలి. మొదటిసారి 3 గ్రాముల కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ను లీటర్‌ నీటికి కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి. మూడు రోజుల తర్వాత రెండోసారి 2.5 గ్రాముల కాపర్‌ హైడ్రాక్సైడ్‌ లేదా 2.5 గ్రాముల సైమాక్సినిల్‌+ మ్యాంకోజెబ్‌ మందును లీటరు నీటికి కలిపి మొదళ్ల దగ్గర పోయాలి. వారం పాటు నీటి తడులు ఆపాలి.

ఇదీ చదవండి: Farmers Problems: అన్నదాత ఉసురు తీస్తోన్న ముసురు.. తేమకు మొలకెత్తుతోన్న ధాన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.