ETV Bharat / state

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆర్ తీరే కారణం: భట్టి

author img

By

Published : Oct 14, 2019, 2:31 PM IST

Updated : Oct 14, 2019, 3:08 PM IST

ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎవరు తీసుకొచ్చారని సీఎంని భట్టి ప్రశ్నించారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ తీరును విమర్శిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఆర్టీసీ కార్మికులకు గతంలో ఇచ్చిన హామీలన్నీ అమలుచేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్​ చేశారు. కార్మికులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని ఎవరు తీసుకొచ్చారని ముఖ్యమంత్రిని భట్టి ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శ్రీనివాస్​రెడ్డి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలిస్తానని గతంలో కేసీఆరే చెప్పి.. ఇప్పుడు మాటమార్చడం సరికాదన్నారు. నష్టాన్ని పూడ్చటానికి ఆర్టీసీ ఆస్తులను అమ్ముతాననడం న్యాయం కాదని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ తీరును విమర్శిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఇదీ చదవండిః ప్రజాస్వామ్యంలో ఉద్యమాల అణచివేత దారుణం

ఆర్టీసీ కార్మికులకు గతంలో ఇచ్చిన హామీలన్నీ అమలుచేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్​ చేశారు. కార్మికులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని ఎవరు తీసుకొచ్చారని ముఖ్యమంత్రిని భట్టి ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శ్రీనివాస్​రెడ్డి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలిస్తానని గతంలో కేసీఆరే చెప్పి.. ఇప్పుడు మాటమార్చడం సరికాదన్నారు. నష్టాన్ని పూడ్చటానికి ఆర్టీసీ ఆస్తులను అమ్ముతాననడం న్యాయం కాదని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ తీరును విమర్శిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఇదీ చదవండిః ప్రజాస్వామ్యంలో ఉద్యమాల అణచివేత దారుణం

Last Updated : Oct 14, 2019, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.