ETV Bharat / state

Bhatti Fires on BRS Government : 'దోపిడీ పాలకులను తెలంగాణ సమాజం తరిమి కొట్టాలి'

Bhatti Fires on BRS Government : రాష్ట్రంలోని ప్రజలు ఓటు హక్కు వినియోగించుకొని దోపిడీదారులకు బుద్ధి చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బీజేపీకు బీ-టీమ్‌లా బీఆర్ఎస్ పనిచేస్తోందని.. ఎంఐఎం దానికి సహకరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్​కు ఓటు వేస్తే.. బీజేపీకి వేసినట్లేనని తెలిపారు. అదేవిధంగా దోపిడీ పాలకులను తెలంగాణ సమాజం నుంచి తరిమి కొట్టాలని ఆరోపించారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2023, 7:42 PM IST

Bhatti Fires on BRS Government
Bhatti

Bhatti Fires on BRS Government : మేనిఫెస్టో పేరిట మరోసారి రాష్ట్ర ప్రజలకు భ్రమలు కల్పించి దగా చేసేందుకు బయలుదేరిన భారత రాష్ట్ర సమితి(BRS) ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు బీఆర్ఎస్​ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేసేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

Bhatti Vikramarka on Congress 6 Guarantees : ఖమ్మం జిల్లా చింతకాని మండలం అనంతసాగరంలో కాంగ్రెస్ బూత్ స్థాయి నాయకుల(Congress Booth Level Leaders)తో భట్టి సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాల(Congress 6 Guarantees)ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం నిర్వహించిన సీఎల్పీ నేత భట్టి మాట్లాడారు. బీజేపీకు బీఆర్ఎస్ బీ-టీమ్ గానే వ్యవహరిస్తుందని వీరికి ఎంఐఎం భజన చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్​కు ఓటు వేస్తే బీజేపీకు వేసినట్లేనని విమర్శించారు.

Bhatti Comments on BRS Manifesto : రాష్ట్ర వనరులు, సంపద ప్రజలకు చెందకుండా బీఆర్ఎస్ దోచుకుంటోందని భట్టి మండిపడ్డారు. హైదరాబాద్ చుట్టూ భూముల్ని అప్పనంగా అమ్మేసుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తుల్ని 30 ఏళ్ల పాటు లీజులకు ఇచ్చి ప్రభుత్వ ఆదాయం ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్ల అప్పులు చేశారని పేర్కొన్నారు. దోపిడీ ప్రభుత్వాన్ని వదిలించుకొని.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

'దోపిడీ పాలకులను తెలంగాణ సమాజం నుంచి తరిమి కొట్టాలి. తెలంగాణ తెచ్చుకున్నది దొరలు, దోపిడీదారుల కోసం కాదు. ఓటు హక్కు వినియోగించుకొని దోపిడీదారులకు బుద్ధి చెప్పాలి. బీజేపీకి బీటీమ్‌లా బీఆర్ఎస్ పనిచేస్తోంది.. ఎమ్‌ఐఎమ్‌ సహకరిస్తోంది. బీఆర్ఎస్​కు ఓటు వేస్తే.. బీజేపీకు ఓటు వేసినట్లే. ప్రభుత్వ ఆస్తులన్నింటిని కేంద్ర ప్రభుత్వం అమ్ముకుంటుంది. తెలంగాణలో భూములను కేసీఆర్‌ అమ్ముకుంటున్నారు. రింగ్‌రోడ్డుపై రాబోయే 30 ఏళ్ల ఆదాయాన్ని ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టించారు. బీసీ బంధు బీసీలందరికీ ఇవ్వకుండా.. మీకు కావాల్సిన వారికి మాత్రమే ఇస్తున్నారు.' -భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

Khammam Congress Clash 2023 : ఖమ్మం కాంగ్రెస్​లో అంతర్యుద్ధం.. ఉప్పునిప్పులా భట్టి, రేణుక వర్గాలు

Telangana Congress Plans For Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకుందని భట్టి స్పష్టం చేశారు. ముమ్మాటికీ గెలుపు గుర్రాలకే టికెట్లు దక్కుతాయన్న ఆయన.. పార్టీ అవసరాలు, పార్టీ విధేయ, సామాజిక సమీకరణాల కలబోతగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. వామపక్షాలతో పొత్తుల అంశం అధిష్ఠానం పరిధిలో ఉందని చెప్పారు. భావసారుప్యత కలిగిన పార్టీలో ఎన్నికల్లో కలిసి వెళ్లాలన్నది కాంగ్రెస్ అభిమతమని వివరించారు.

Bhatti Vikramarka on Congress Bus Yatra : రాష్ట్రంలో చేపట్టనున్న బస్సు యాత్ర(Bus Yatra), ప్రచార షెడ్యూల్​కు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. అలాగే షర్మిల పార్టీ విలీన ప్రక్రియకు సంబంధించిన అంశం పార్టీ అధిష్ఠానం పరిధిలో ఉంటుందని.. దీనిపై తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. ప్రతీ లోక్​సభ నియోజకవర్గంలో రెండు స్థానాలు బీసీలకు ఇవ్వాలన్న నిబంధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.

Bhatti Fires on BRS Government దోపిడీ పాలకులను తెలంగాణ సమాజం తరిమి కొట్టాలి

Bhatti Challenges TS Government : కర్ణాటకలో అభివద్ధిపై బీఆర్‌ఎస్‌ మంత్రులకు సవాల్‌ విసిరిన భట్టి విక్రమార్క

Congress Leaders on Telangana Assembly Elections : 'ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు.. కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం'

Bhatti Fires on BRS Government : మేనిఫెస్టో పేరిట మరోసారి రాష్ట్ర ప్రజలకు భ్రమలు కల్పించి దగా చేసేందుకు బయలుదేరిన భారత రాష్ట్ర సమితి(BRS) ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు బీఆర్ఎస్​ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేసేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

Bhatti Vikramarka on Congress 6 Guarantees : ఖమ్మం జిల్లా చింతకాని మండలం అనంతసాగరంలో కాంగ్రెస్ బూత్ స్థాయి నాయకుల(Congress Booth Level Leaders)తో భట్టి సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాల(Congress 6 Guarantees)ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం నిర్వహించిన సీఎల్పీ నేత భట్టి మాట్లాడారు. బీజేపీకు బీఆర్ఎస్ బీ-టీమ్ గానే వ్యవహరిస్తుందని వీరికి ఎంఐఎం భజన చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్​కు ఓటు వేస్తే బీజేపీకు వేసినట్లేనని విమర్శించారు.

Bhatti Comments on BRS Manifesto : రాష్ట్ర వనరులు, సంపద ప్రజలకు చెందకుండా బీఆర్ఎస్ దోచుకుంటోందని భట్టి మండిపడ్డారు. హైదరాబాద్ చుట్టూ భూముల్ని అప్పనంగా అమ్మేసుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తుల్ని 30 ఏళ్ల పాటు లీజులకు ఇచ్చి ప్రభుత్వ ఆదాయం ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్ల అప్పులు చేశారని పేర్కొన్నారు. దోపిడీ ప్రభుత్వాన్ని వదిలించుకొని.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

'దోపిడీ పాలకులను తెలంగాణ సమాజం నుంచి తరిమి కొట్టాలి. తెలంగాణ తెచ్చుకున్నది దొరలు, దోపిడీదారుల కోసం కాదు. ఓటు హక్కు వినియోగించుకొని దోపిడీదారులకు బుద్ధి చెప్పాలి. బీజేపీకి బీటీమ్‌లా బీఆర్ఎస్ పనిచేస్తోంది.. ఎమ్‌ఐఎమ్‌ సహకరిస్తోంది. బీఆర్ఎస్​కు ఓటు వేస్తే.. బీజేపీకు ఓటు వేసినట్లే. ప్రభుత్వ ఆస్తులన్నింటిని కేంద్ర ప్రభుత్వం అమ్ముకుంటుంది. తెలంగాణలో భూములను కేసీఆర్‌ అమ్ముకుంటున్నారు. రింగ్‌రోడ్డుపై రాబోయే 30 ఏళ్ల ఆదాయాన్ని ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టించారు. బీసీ బంధు బీసీలందరికీ ఇవ్వకుండా.. మీకు కావాల్సిన వారికి మాత్రమే ఇస్తున్నారు.' -భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

Khammam Congress Clash 2023 : ఖమ్మం కాంగ్రెస్​లో అంతర్యుద్ధం.. ఉప్పునిప్పులా భట్టి, రేణుక వర్గాలు

Telangana Congress Plans For Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకుందని భట్టి స్పష్టం చేశారు. ముమ్మాటికీ గెలుపు గుర్రాలకే టికెట్లు దక్కుతాయన్న ఆయన.. పార్టీ అవసరాలు, పార్టీ విధేయ, సామాజిక సమీకరణాల కలబోతగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. వామపక్షాలతో పొత్తుల అంశం అధిష్ఠానం పరిధిలో ఉందని చెప్పారు. భావసారుప్యత కలిగిన పార్టీలో ఎన్నికల్లో కలిసి వెళ్లాలన్నది కాంగ్రెస్ అభిమతమని వివరించారు.

Bhatti Vikramarka on Congress Bus Yatra : రాష్ట్రంలో చేపట్టనున్న బస్సు యాత్ర(Bus Yatra), ప్రచార షెడ్యూల్​కు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. అలాగే షర్మిల పార్టీ విలీన ప్రక్రియకు సంబంధించిన అంశం పార్టీ అధిష్ఠానం పరిధిలో ఉంటుందని.. దీనిపై తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. ప్రతీ లోక్​సభ నియోజకవర్గంలో రెండు స్థానాలు బీసీలకు ఇవ్వాలన్న నిబంధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.

Bhatti Fires on BRS Government దోపిడీ పాలకులను తెలంగాణ సమాజం తరిమి కొట్టాలి

Bhatti Challenges TS Government : కర్ణాటకలో అభివద్ధిపై బీఆర్‌ఎస్‌ మంత్రులకు సవాల్‌ విసిరిన భట్టి విక్రమార్క

Congress Leaders on Telangana Assembly Elections : 'ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు.. కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.