ETV Bharat / state

తహసీల్దారు కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

ఖమ్మం జిల్లా చింతకాని తాహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భూమి విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ కార్యాలయం ఎదుట అఘాయిత్నానికి యత్నించింది.

author img

By

Published : Aug 6, 2020, 11:09 AM IST

suicide attempt
చింతకాని తహసీల్దారు కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

ఖమ్మం జిల్లా నేరడ రెవెన్యూ పరిధిలోని వివాదాస్పద భూమి విషయమై ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గత కొన్నేళ్లుగా రెండు కుటుంబాల మధ్య వివాదం జరుగుతోంది. వారిలో ఓ కుటుంబం ఆర్డీవో కార్యాలయాన్ని ఆశ్రయించగా గతంలో ఇచ్చిన పాసుపుస్తకాన్ని రద్దు చేస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.

భూమి సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇరు కుటుంబాలను ఆ భూమిజోలికి వెళ్లొద్దని స్థానిక తహసీల్దారు ఇరు కుటుంబాల వారికి సూచించారు. కానీ ఈ మధ్యకాలంలో ఓ కుటుంబానికి చెందిన వృద్ధురాలు మృతి చెందడం వల్ల ఆమె మృతదేహాన్ని ఆ కుటుంబ సభ్యులు వివాదాస్పద భూమిలో ఖననం చేశారు. ఈ విషయం తెలిసి మరో కుటుంబానికి చెందిన మహిళ చింతకాని తహసీల్దారు కార్యాలయం ఎదుట ఒంటిపై కిరోసిన్​ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడం వల్ల ఆందోళన విరమించింది.

ఖమ్మం జిల్లా నేరడ రెవెన్యూ పరిధిలోని వివాదాస్పద భూమి విషయమై ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గత కొన్నేళ్లుగా రెండు కుటుంబాల మధ్య వివాదం జరుగుతోంది. వారిలో ఓ కుటుంబం ఆర్డీవో కార్యాలయాన్ని ఆశ్రయించగా గతంలో ఇచ్చిన పాసుపుస్తకాన్ని రద్దు చేస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.

భూమి సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇరు కుటుంబాలను ఆ భూమిజోలికి వెళ్లొద్దని స్థానిక తహసీల్దారు ఇరు కుటుంబాల వారికి సూచించారు. కానీ ఈ మధ్యకాలంలో ఓ కుటుంబానికి చెందిన వృద్ధురాలు మృతి చెందడం వల్ల ఆమె మృతదేహాన్ని ఆ కుటుంబ సభ్యులు వివాదాస్పద భూమిలో ఖననం చేశారు. ఈ విషయం తెలిసి మరో కుటుంబానికి చెందిన మహిళ చింతకాని తహసీల్దారు కార్యాలయం ఎదుట ఒంటిపై కిరోసిన్​ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడం వల్ల ఆందోళన విరమించింది.

ఇదీ చూడండి : ఈటీవీ భారత్​ స్పందన: '‘పీఎం కిసాన్‌’'లో తెలంగాణకు చోటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.