ETV Bharat / state

సీఎం సభకు లక్షన్నర మంది హాజరయ్యే అవకాశం

author img

By

Published : Apr 1, 2019, 1:10 PM IST

పార్లమెంట్​ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మంలో కేసీఆర్ సభకు తెరాస శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఈనెల 4న జరగనున్న సీఎం సభ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్లు తెరాస ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్​ రెడ్డి తెలిపారు.

7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు లక్షన్నర మంది తరలిరానున్నారు : పల్లా
బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో కేసీఆర్ సభకు సన్నద్ధమవుతున్న తెరాస
లోక్​సభ ఎన్నికల ప్రచారానికి ఈనెల 4న ఖమ్మంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అజయ్ కుమార్‌, ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి... ఎస్‌ఆర్‌- బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు.సుమారు లక్షన్నర మంది కూర్చునేందుకు అణువుగా తీర్చిదిద్దుతున్నట్లు పల్లా స్పష్టం చేశారు. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలి రానున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి :సాయంత్రం గోదావరిఖనిలో కేసీఆర్ బహిరంగ సభ

బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో కేసీఆర్ సభకు సన్నద్ధమవుతున్న తెరాస
లోక్​సభ ఎన్నికల ప్రచారానికి ఈనెల 4న ఖమ్మంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అజయ్ కుమార్‌, ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి... ఎస్‌ఆర్‌- బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు.సుమారు లక్షన్నర మంది కూర్చునేందుకు అణువుగా తీర్చిదిద్దుతున్నట్లు పల్లా స్పష్టం చేశారు. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలి రానున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి :సాయంత్రం గోదావరిఖనిలో కేసీఆర్ బహిరంగ సభ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.