బల్దియా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో రాజకీయ వేడి రాజుకుంది. అధికార పార్టీ నాయకులు విపక్ష పార్టీపై విమర్శలు చేస్తూ... ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అధికార పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. మూడేళ్ళ పాపకి 35 ఏళ్ళు వేసి ఓటరు గుర్తింపు కార్డు ఇచ్చిన ఘనత నగరపాలక అధికారులకే దక్కుతుందని విపక్ష పార్టీల నేతలు చెబుతున్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు తెరాసకు మద్దతుగా వ్యవహరించడం బాగాలేదంటూ మండిపడుతున్నారు.
ఇవీ చూడండి: భారీ ధరకు 'దర్బార్' హక్కులు.. 'తలైవా' డబుల్ సెంచరీ