ETV Bharat / state

మారనున్న కరీంనగర్​ తాత్కాలిక కూరగాయల మార్కెట్​ - కరీంనగర్​ కూరగాయల మార్కెట్

కరీంనగర్​ బస్టాండ్​లో గత 50 రోజులుగా కొనసాగుతున్న తాత్కాలిక కూరగాయల మార్కెట్​ను మరోచోటికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు  పూర్తి చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను నడిపేందుకు నిర్ణయం తీసుకున్న క్రమంలో అధికారులు కూరగాయల మార్కెట్​ కోసం ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్​ బస్టాండ్​ నుంచి అంబేడ్కర్​ స్టేడియంకు కూరగాయల మార్కెట్​ తరలించేందుకు రంగం సిద్ధమైంది.

Vegetable Market Shifted From Karim nagar Bus stand To Ambedkar Stadium
మారనున్న కరీంనగర్​ తాత్కాలిక కూరగాయల మార్కెట్​
author img

By

Published : May 18, 2020, 10:21 PM IST

ఇండోనేషియన్ల రాకతో.. కరీంనగర్​లో 13 మందికి కరోనా పాజిటివ్​ రావడం, మర్కజ్​ వెళ్లి వచ్చిన వారిలో మరో ఆరుగురికి కరోనా అని తేలడం వంటి ఘటనలు చోటు చేసుకున్నందున కరీంనగర్​లో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని పరిస్థితి చక్కదిద్దేందుకు శ్రమించారు. వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఆ క్రమంలో బస్సులు నడపడం కూడా ఆపేశారు. ప్రజలు నిత్యావసరాల కోసం, కూరగాయల కోసం ఇబ్బంది పడకుండా కరీంనగర్​ బస్టాండ్​ను తాత్కాలిక కూరగాయల మార్కెట్​గా మార్చారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల ప్రజల కోసం 16 తాత్కాలిక కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేశారు. ప్రజలు, రైతులు, కూరగాయల అమ్మకందారులు భౌతిక దూరం పాటించేలా విశామైన ప్రాంతంలో కూరగాయల మార్కెట్​ సిద్ధం చేశారు.

తాజాగా లాక్​డౌన్​ కాస్త సడలించి.. కొన్ని నిర్ణీత ప్రాంతాలకు బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అధికారులు కరీంనగర్​ బస్టాండ్​లో ఉన్న మార్కెట్​ను పట్టణంలోని అంబేడ్కర్​ స్టేడియంకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు మార్కెటింగ్​ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి అదికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇండోనేషియన్ల రాకతో.. కరీంనగర్​లో 13 మందికి కరోనా పాజిటివ్​ రావడం, మర్కజ్​ వెళ్లి వచ్చిన వారిలో మరో ఆరుగురికి కరోనా అని తేలడం వంటి ఘటనలు చోటు చేసుకున్నందున కరీంనగర్​లో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని పరిస్థితి చక్కదిద్దేందుకు శ్రమించారు. వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఆ క్రమంలో బస్సులు నడపడం కూడా ఆపేశారు. ప్రజలు నిత్యావసరాల కోసం, కూరగాయల కోసం ఇబ్బంది పడకుండా కరీంనగర్​ బస్టాండ్​ను తాత్కాలిక కూరగాయల మార్కెట్​గా మార్చారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల ప్రజల కోసం 16 తాత్కాలిక కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేశారు. ప్రజలు, రైతులు, కూరగాయల అమ్మకందారులు భౌతిక దూరం పాటించేలా విశామైన ప్రాంతంలో కూరగాయల మార్కెట్​ సిద్ధం చేశారు.

తాజాగా లాక్​డౌన్​ కాస్త సడలించి.. కొన్ని నిర్ణీత ప్రాంతాలకు బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అధికారులు కరీంనగర్​ బస్టాండ్​లో ఉన్న మార్కెట్​ను పట్టణంలోని అంబేడ్కర్​ స్టేడియంకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు మార్కెటింగ్​ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి అదికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చూడండి: 'మీ అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.