కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేయలేదని కరీంనగర్ జిల్లా తెదేపా అధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి ఆరోపించారు. రోజులు గడుస్తున్నా తేమ శాతం ఉందని కొనుగోలు చేయకపోవడం వల్ల మార్కెట్ల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నరన్నారు. రామడుగు మండలం గోపాల్రావు పేట వ్యవసాయ మార్కెట్ను తెదేపా నాయకులు సందర్శించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించని పక్షంలో రైతులకు మద్దతుగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: ములుగు జిల్లాలో పలు ప్రాజెక్టులు సందర్శించిన స్మితా సబర్వాల్