ETV Bharat / state

'నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం మోపుతాం.' - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండలంలో టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు నిర్వహించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారన్న సమాచారంతో రైడ్ చేశారు. 160 కిలోల నకిలీ పత్తి విత్తనాలతోపాటు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

polices rides on fake seeds company
'నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం మోపుతాం.'
author img

By

Published : Jun 20, 2020, 7:32 PM IST

కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండలంలో టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు నిర్వహించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టి, 160 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, 2200 ప్రముఖ కంపెనీల పేరిట ఉన్న ఖాళీ ప్యాకెట్లు, ఎలక్ట్రానిక్​ తూకం ప్యాకింగ్​ యంత్రము, రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్​కు తరలించారు.

కరీంనగర్ విద్యానగర్ కు చెందిన మడుపు శ్రీనివాస్ రెడ్డి, పెద్దపెల్లి జిల్లా రంగం పల్లి కి చెందిన ఇందూరి లింగమూర్తి, హుజురాబాద్​కు చెందిన పెద్ద మల్లురాజు, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చెందిన తుమ్మ సురేష్ రెడ్డి, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన గట్టిలేని రాజేష్​లను పోలీసులు రిమాండ్​కు తరలించారు.

నకిలీ విత్తనాలు విక్రయింస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాల గురించి సమాచారం వస్తే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా ప్రజలను కోరారు. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ.శశిధర్ రెడ్డిని, ఆర్ ప్రకాష్​ను పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి అభినందించారు.

ఇవీ చూడండి:'ఇకపై సొంతూళ్లకు సమీపంలోనే ఉపాధి'

కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండలంలో టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు నిర్వహించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టి, 160 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, 2200 ప్రముఖ కంపెనీల పేరిట ఉన్న ఖాళీ ప్యాకెట్లు, ఎలక్ట్రానిక్​ తూకం ప్యాకింగ్​ యంత్రము, రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్​కు తరలించారు.

కరీంనగర్ విద్యానగర్ కు చెందిన మడుపు శ్రీనివాస్ రెడ్డి, పెద్దపెల్లి జిల్లా రంగం పల్లి కి చెందిన ఇందూరి లింగమూర్తి, హుజురాబాద్​కు చెందిన పెద్ద మల్లురాజు, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చెందిన తుమ్మ సురేష్ రెడ్డి, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన గట్టిలేని రాజేష్​లను పోలీసులు రిమాండ్​కు తరలించారు.

నకిలీ విత్తనాలు విక్రయింస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాల గురించి సమాచారం వస్తే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా ప్రజలను కోరారు. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ.శశిధర్ రెడ్డిని, ఆర్ ప్రకాష్​ను పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి అభినందించారు.

ఇవీ చూడండి:'ఇకపై సొంతూళ్లకు సమీపంలోనే ఉపాధి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.